కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్(47) మంగళవారం ఢిల్లీ-ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు.
Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Sand mafia: మహారాష్ట్రలో ఇసుక మాఫియా బరితెగించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ను హతమర్చే యత్నం చేసింది. ఇసుకతో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను బీడ్ జిల్లా కలెక్టర్ నిలువరించే సమయంలో ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని నాసిక్లోని కోశింపాడ గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ బిందేలు నింపడానికి బావిలోకి దిగుతున్నారు.
Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు.
మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) ఎట్టకేలకు తొలి విజయం సాధించింది.
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.