Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aurangzeb Picture: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమస్యను ఒక హిందూ సంస్థ లేవనెత్తిందని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్లెట్లో పనిచేస్తున్నాడు.ఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 298, 153 ఎ కింద నవీ ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించి విడుదల చేశారు.ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంపై కొల్హాపూర్లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్లను కీర్తించడంపై మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చెలరేగాయి.ఔరంగజేబ్ను కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిరసనలకు దారితీసింది. కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంస్థల ప్రజలు జూన్ 7వతేదీన కొల్హాపూర్ బంద్నకు పిలుపునిచ్చారు.ఈ బంద్ హింసాత్మక నిరసనలకు దారితీసింది. మా మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని మేం సహించమని.. హిందూ సమాజం పరిరక్షణ కోసం కత్తులు దూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. దీన్ని సహించేది లేదని అని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.
Also Read: Silvio Berlusconi: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కన్నుమూత
అంతకుముందు అహ్మద్నగర్లో ఊరేగింపులో ఔరంగజేబు ఫోటోలను ప్రదర్శించారు. సంగమ్నేర్ పట్టణంలో, బాలుడి హత్యకు ప్రతిగా సకల్ హిందూ సమాజ్ ర్యాలీలో రాళ్లు రువ్వబడ్డాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. విడిగా, సంగమ్నేర్లో కూడా మతపరమైన ఊరేగింపు సందర్భంగా అభ్యంతరకరమైన నినాదాలతో ఔరంగజేబు పోస్టర్ ప్రదర్శించబడిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..