Asaduddin Owaisi: “ఔరంగజేబు” వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. “గాడ్సే” సంతానం ఎవరంటూ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఔరంగజేబు సంతానం ఎక్కడ నుంచి వచ్చారు..? దీని వెనక ఎవరున్నారు..? దీనిని మేము కనుగొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు సంతానం అని ఫడ్నవీస్ సంబోధించడాన్ని తప్పుపట్టారు. నాథురామ్ గాడ్సే, వామన శిమరామ్ ఆప్టే సంతానం ఎవరో తెలుసా..? అంటూ ఫడ్నవీస్ పై ఎదురుదాడి ప్రారంభించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Disney Hotstar: జియో బాటలోనే హాట్ స్టార్.. ఆ రెండు టోర్నీలను ఫ్రీగా చూసుకోవచ్చు..!
ఈ ఘర్షణలపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘‘ అకస్మత్తుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు సంతానం జన్మించింది. వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టి, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారని, దీంతోనే కొల్హాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వారు ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలను మేము కనుగొంటాం’’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మీరు అంత నిపుణులని తెలియదని.. గాడ్సే, ఆప్టే పిల్లలు కూడా ఎవరో తెలుసుకోవాలి’’ అంటూ సెటైర్లు వేశారు.
బుధవారం కోల్హాపూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. కొల్హాపూర్ ఘటనపై రాజకీయం అవసరం లేదని శరద్ పవార్ గురువారం అన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది ఇలాంటి పరిస్థితిన సృష్టించారు, ఇది సమాజానికి మంచిది కాదని, దీని వల్ల సామాన్యులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని శరద్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా శాంతిభద్రతల పర్యవేక్షించారు. పోలీసులు విచారణ కొనసాగుతుందని, దోషులుగా తేలిని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!