Asaduddin Owaisi: “ఔరంగజేబు” వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. “గాడ్సే” సంతానం ఎవరంటూ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఔరంగజేబు సంతానం ఎక్కడ నుంచి వచ్చారు..? దీని వెనక ఎవరున్నారు..? దీనిని మేము కనుగొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు సంతానం అని ఫడ్నవీస్ సంబోధించడాన్ని తప్పుపట్టారు. నాథురామ్ గాడ్సే, వామన శిమరామ్ ఆప్టే సంతానం ఎవరో తెలుసా..? అంటూ ఫడ్నవీస్ పై ఎదురుదాడి ప్రారంభించారు.
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
Read Also: Disney Hotstar: జియో బాటలోనే హాట్ స్టార్.. ఆ రెండు టోర్నీలను ఫ్రీగా చూసుకోవచ్చు..!
ఈ ఘర్షణలపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘‘ అకస్మత్తుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు సంతానం జన్మించింది. వారు ఔరంగజేబు స్టేటస్ పెట్టి, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారని, దీంతోనే కొల్హాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వారు ఎక్కడ నుంచి వచ్చారనే వివరాలను మేము కనుగొంటాం’’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మీరు అంత నిపుణులని తెలియదని.. గాడ్సే, ఆప్టే పిల్లలు కూడా ఎవరో తెలుసుకోవాలి’’ అంటూ సెటైర్లు వేశారు.
బుధవారం కోల్హాపూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. కొల్హాపూర్ ఘటనపై రాజకీయం అవసరం లేదని శరద్ పవార్ గురువారం అన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది ఇలాంటి పరిస్థితిన సృష్టించారు, ఇది సమాజానికి మంచిది కాదని, దీని వల్ల సామాన్యులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని శరద్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా శాంతిభద్రతల పర్యవేక్షించారు. పోలీసులు విచారణ కొనసాగుతుందని, దోషులుగా తేలిని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!