మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాల సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. బీజేపీ, ఎన్సీపీ, షిండే సేన కూటమి 288 స్థానాలకు గాను 235 స్థానాలను కైవసం చేసుకుంది. మహావికాస్ అఘాడీ కేవలం 50 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడీ పార్టీల పరిస్థితి స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగానే మిగిలిపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్లో శివాజీ పాటిల్ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 233 స్థానాలు మహాయుతి కూటమినే కైవసం చేసుకుంది. మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం పాలైంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదే అతిపెద్ద ప్రశ్న. మరి మహాయుతి వర్గాల్లో ఏ పార్టీ అధినేతకు ఏ స్థానం దక్కుతుంది? ఈ ప్రశ్నల నడుమ దీనికి సంబంధించిన కొన్ని రియాక్షన్లు కూడా రావడం మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు జార్ఖండ్లో జేఎంఎం కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. జేఎంఎం ప్లస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని 'ప్రపంచ స్థాయి' జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్లో జేఎంఎం ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం సాధించిన తర్వాత ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ..