Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 05న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండేని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత తొలిసారి ఫడ్నవీస్, షిండే సమావేశమయ్యారు.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
మహారాష్ట్రలోని లాతూర్లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం గడిచినా, ఇంకా సీఎం ఎవరనే క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ‘‘మహాయుతి’’ కూటమి అఖండ విజయాన్ని సాధించింది.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ఖరారు చేసినప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే అన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Ajit Pawar: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచి వారం గడిచింది. అయితే, ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, ముంబైలో రాష్ట్ర నేతలతో బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్సీపీ, శివసేనలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా డిసెంబర్ 05న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజే ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ ఈ రోజు స్పష్టం చేసింది.
Maharashtra: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్లైన్ పెట్టుకుంది బీజేపీ. కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 05 సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఐకానిక్ ఆజాద్ మైదాన్లో ఈ వేడుకలు జరగనున్నాయి.