Eknath Shinde: ఆందోళనకరంగా ఏక్నాథ్ షిండే ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
- ఆందోళనకరంగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఆరోగ్యం..
- థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏక్నాథ్ షిండేకు చికిత్స..
- షిండేకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో తన స్వగ్రామం సతారాకు వెళ్లగా.. తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇక, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేయడంతో షిండే తన అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఇక, సోమవారం ఉదయం తిరిగి ముంబైకి వచ్చారు. ఈరోజు ఆరోగ్యం కుదుటపడకపోయే సరికి థానేలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: Priyanka Jain: శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఇంతకు ఏమైందంటే ?
Also Read
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ఇదిలా ఉండగా.. ఏక్ నాథ్ షిండే కనిపించకుండా పోయాడంటూ జరుగుతున్న ప్రచారంపై శివసేన (షిండే) నేత దీపక్ కేసర్కర్ స్పందించారు. షిండే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. పూర్తి స్థాయిలో కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ఇక, ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వంలో జరిగాయి.. షిండే స్థాయిని ఎలా కాపాడుకోవాలనేది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన యొక్క సహకారాన్ని తగిన విధంగా గుర్తించాలని కేసర్కర్ తెలిపారు. కాగా, షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమిలో నుంచి మహరాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటించనున్నారు. ఈ నెల 5న ఆజాద్ మైదానంలో నూతన సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!