Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్లో కుల్వంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్లో కుల్వంత్ ఈ ఘనతను…
PM MODI: 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్పూర్లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
మధ్యప్రదేశ్లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.
Tobacco: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పొగాకు ఇవ్వలేదని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని షాహ్దోల్ జిల్లాలోని బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు రామ్లా కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్ను మధ్యప్రదేశ్లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.
ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
Ayodhya: అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ మహిళకు వివాహమైన ఐదు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్త సదరు మహిళను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అయితే, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తన భర్త నుంచి విడాకుల కావాలని కోరింది. మహిళ తన విడాకులను భోపాల్ లోని కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసింది.