MP Bureaucrat Killed: నామినీగా చేయనందుకు.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్యను హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Bureaucrat Killed: ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త దిండుతో ఊపిరాడకుండా నొక్కి చంపేశాడు. 51 ఏళ్ల నిషా నపిట్ షాపురాలో మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తోంది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన 45 ఏళ్ల మనీష్ శర్మతో 2020లో పెళ్లి జరిగింది. అతనిని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయాలనే అతని డిమాండ్కు ఆమె అంగీకరించకపోవడంతో హత్య చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ పటేల్ అన్నారు.
Read Also: Congress : ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
Also Read
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే 'నేరేడు జామ్' ఇంట్లోనే చేయండి ఇలా.!
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మనీష్ శర్మ ఆదివారం ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి, శవం దగ్గర ఆరు గంటలపాటు కూర్చుని, ఆపై మృతదేహాన్ని సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారని ఎస్పీ తెలిపారు. మనీష్ శర్మ తన రక్తంతో తడిసిన బట్టలతో పాటు వాషింగ్ మెషీన్లో దిండును కూడా ఉతికినట్లు ఎస్పీ అఖిల్ పటేల్ వెల్లడించారు. ఏ ఉద్యోగం లేని అతడు డబ్బులు కోసం భార్యను వేధిస్తున్నాడని నిషా కుటుంబం ఆరోపించింది. అలాగే ప్రభుత్వ రికార్డులు, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనీష్ శర్మను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించినందుకు దర్యాప్తు బృందాన్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ముఖేష్ శ్రీవాస్తవ అభినందించి రూ.20,000 రివార్డును ప్రకటించారు.
తాజావార్తలు
-
Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్రౌండర్!
-
Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
-
E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
-
Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
-
Explainer: పాక్తో వేగలేం! పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!