Madhya Pradesh HC: ఇళ్లు కూల్చడం “ఫ్యాషన్” అయిపోయింది.. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు “ఫ్యాషన్”గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Amit Shah: అయోధ్య ప్రాణప్రతిష్ఠపై లోక్సభలో అమిత్ షా ఏమన్నారంటే..!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
రాధా లాంగ్రీ అనే మహిళకు చెందిన ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఆమెకు రూ. లక్ష పరిహారం ఇస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్థానిక పరిపాలన, స్థానిక సంస్థలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఏదైనా ఇంటిని కూల్చివేసి వార్తా పత్రికల్లో ప్రచురించడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది అని జస్టిన్ వివేక్ రుషియా ధర్మాసనం పేర్కొంది.
ఇంటి కూల్చివేత చివరి మార్గం కావాలని, క్రమబద్ధీకరించడానికి ఇంటి యజమానికి సరైన అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే, సరైన అనుమతి లేకుండా నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలను తయారు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చవేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!