Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.
Bees attack: మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన జరిగింది. పెళ్లికి పిలువని ఆహ్వానితులుగా తేనెటీగలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాహానికి హాజరైన బంధువులు ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుణ జిల్లాలో ఒక వివాహ వేడుకలో జరిగింది. హోటల్ పైకప్పుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో తేనెటీగలు విరుచుకుపడటంతో వాటి నుంచి తప్పించుకునేందేకు పెళ్లికి హాజరైన బంధువులు ఎటుపడితే అటు పరుగెత్తారు. దీంతో ఒక్కసారిగా…
Pregnant Woman Raped in Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ఈ దారుణ ఘటన మొరెనా జిల్లా అంబాహ్ పట్టణానికి సమీపంలోని చాంద్ కా పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు ప్రస్తుతం గ్వాలియర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంబాహ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అలోక్ పరిహార్ తెలిపిన వివరాలు ఇలా…
Kamal Nath: గతేడాది చివర్లో జరిగి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అన్ని తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. మరోవైపు ఆయన కుమారుడు చింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఇప్పటికే తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ని తొలగించారు. ఈ నేపథ్యంలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేందుకు నిప్పటించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిల్లో ప్రాణాల కోసం పోరాడుతోందని పోలీసులు శనివారం తెలిపారు. 80 శాతం గాయాలైన మహిళ గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్…
Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్లో కుల్వంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్లో కుల్వంత్ ఈ ఘనతను…
PM MODI: 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్పూర్లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.