మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో తరచూ వాయిదాలు, ఆందోళనలతో ఉభయ సభలు అనుకున్న సమయం కంటే తక్కువ నడిచాయి.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సోమవారం లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చర్చించేందుకు ఈ సభ జీరో అవర్లో అవకాశం ఇవ్వాలని నోటీసులో కోరారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది.
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే క్లారిటీ వచ్చింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం…
అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్పై ప్రతిపక్షాల గందరగోళం మధ్య కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్కు చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.118 లక్షల కోట్ల బడ్జెట్ను లోక్సభ ఈరోజు ఆమోదించింది.
గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.