Mamata Banerjee: డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు..! సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్కతాలో అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా లోక్సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: Supreme Court: ఆన్లైన్ రమ్మీపై నిషేధం వద్దని ఏపీ హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Also Read
మరోవైపు గవర్నర్ సివి ఆనంద్ బోస్ను గురించి దీదీ మాట్లాడుతూ.. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. తాను గవర్నర్ పదవిని గౌరవిస్తాను, కానీ అతని రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వనని పేర్కొన్నారు. బెంగాల్లో సీపీఐ(ఎం) పాలనను అంతం చేశామని చెప్పారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీనే టార్గెట్ అని.. ఓడిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను బుక్ చేసిందని ఆరోపించారు. తద్వారా ఇతర రాజకీయ పార్టీలు వాటిని ప్రచారానికి ఉపయోగించలేవని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Read Also: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్కి ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో.. సెప్టెంబర్ 2న ప్రయోగం..
మొన్న కోల్కతా సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. కొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కొందరు పోలీసుల మద్దతుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిని వదిలిపెట్టేది లేదు.. చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు జాదవ్పూర్ యూనివర్శిటీలో అల్లర్ల ఘటనపై కూడా స్పందించారు. కొందరు ‘గోలీ మారో’ అంటూ నినాదాలు చేసారని.. వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!