Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఇదే.. బులిటెన్స్ విడుదల చేసిన ఉభయ సభలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Special Sessions: ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. మొదటిరోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగుతాయి. 19 మధ్యాహ్నం నుంచి 22 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సమావేశాలపై పార్లమెంట్ ఉభయ సభలు బులిటెన్స్ విడుదల చేశాయి.. “సంవిధాన్ సభ” నుంచి 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ సాగించనున్నట్టు తన బులెటిన్లో పేర్కొంది రాజ్యసభ.. “సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు” పై చర్చ ఉంటుందని.. ఇతర సభా కార్యక్రమాల తో పాటు ఈ అంశంపై కూడా సెప్టెంబర్ 18వ తేదీన చర్చ సాగుతోందని పేర్కొంది..
మరోవైపు రాజ్యసభ ఆమోదించి లోకసభలో పెండింగ్ లో ఉన్న రెండు బిల్లులు 1) అడ్వకేట్స్ బిల్లు, 2) ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు.. రాజ్యసభలో ప్రవేశ పెట్టి, స్టాండింగ్ కమిటీ కి పంపని మరో రెండు బిల్లులు. 1) ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2) ది ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ అదర్ కమిషనర్స్ ( అప్పాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్, అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు లోక్సభ తన బులెటిన్లో పేర్కొంది.. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం నాలుగు బిల్లులపై చర్చ సాగబోతోంది.. మొత్తం 4 బిల్లులను లోకసభలో ప్రవేశపెట్ట నుంది ప్రభుత్వం. రెండు బిల్లులకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది.. మొత్తం నాలుగు బిల్లుల్లో రెండు బిల్లులు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత లోకసభ ఆమోదం పొందాల్సి ఉంది. మొత్తంగా 4 బిల్లులను లోకసభ లో ఆమోదించాలి.. అందులో రాజ్యసభ 2 బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
ఇక, G20 సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం పూర్తిగా దృష్టి పెట్టింది. 18 నుంచి సమావేశాలు మొదలు కానుండగా.. 17న ఆల్పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేరకు ఆయా పార్టీల సభా పక్ష నేతలకు సమాచారం పంపించింది. ఇంకోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కొందరు కేంద్రమంత్రులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా కోసమే సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవ్ తదితరులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి