Karnataka High Court: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. లోక్సభకు అనర్హులుగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సర్టిఫికెట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కోర్టు ఆయనను లోక్సభకు అనర్హులుగా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ జేడీఎస్ ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.
లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం సమర్పించినందుకు హసన్ లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ఉన్నత న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. 2019లో న్యాయవాది, మాజీ కేడీపీ పార్టీ సభ్యుడు జి. దేవరాజేగౌడ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నామపత్రాలు సమర్పించేటప్పుడు తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదులో ప్రజ్వల్ రేవణ్ణ తన అఫిడవిట్లో అనేక తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన నామినేషన్ను రద్దు చేయాలని న్యాయవాది దువరాజ్ గౌడ కోరారు. దీనికి సంబంధించి సమాచారం సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హసన్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం కోర్టుకు నివేదిక సమర్పించి పలు విచారణలు జరిపింది. అలాగే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అనర్హత వేటు వేయాలని అప్పట్లో ఓడిపోయిన అభ్యర్థి ఎ. మంజు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. ప్రజ్వల్ రేవణ్ణ 2019లో లోక్సభ ఎన్నికల కోసం తన ఆస్తి వివరాలను అఫిడవిట్లో సమర్పించారు. అందులో రూ. 4, 89, 15, 029 విలువైన స్థిరాస్తి, రూ. 1, 68, 86, 632 విలువైన ఆస్తులు ఉన్నాయని వివరించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!