నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:07 గంటలకు ముగుస్తుంది. నాలుగు గంటలకు పైగా సాగే ఈ గ్రహణం భారత్లో ఉన్న ప్రజలకు కనిపించదని నిపుణులు వెల్లడించారు. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనపడదని వారు పేర్కొన్నారు. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనపడుతుంది. అయితే మనకు గ్రహణం…
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్కు దమ్మాయిగూడకు చెందిన మయూర్గా పోలీసులు గుర్తించారు.…
ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం…
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే…
బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన…
✍ జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు✍ హైదరాబాద్లో నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సులో పాల్గొననున్న సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్✍ నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న బీజేపీ నేతలు✍ 34వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభం..…
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్రావు, షేక్పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే…
దేశంలో గత ఏడాది కాలంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఫిన్టెక్ ఇన్ఫినిటీ ఫోరంలో మాట్లాడిన ఆయన… గత ఏడాది కాలంలో మొబైల్ చెల్లింపులు మొదటిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది కాలంలో సుమారు 6.90 కోట్ల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నారని… వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్స్టార్ మహేష్బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు…
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలోనూ రైల్వేల…