భారతీయ రైల్వే ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు.
కాగా గతంలోనూ రైల్వేల ప్రైవేటీకరణ విషయంపై అప్పటి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చారు. తాము ఎప్పటికీ రైల్వేలను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పినా.. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు రైతుల ఆందోళన, ఇతర సంస్థ ఆందోళనల కారణంగా ఈ ఏడాది రైల్వేలకు రూ.36.87 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నార్తన్ రైల్వేకు అత్యధికంగా రూ.22.58 కోట్ల నష్టం వచ్చిందన్నారు. రైల్వేల భద్రత పూర్తిగా రైల్వే పోలీసులు లేదా జిల్లా పోలీసుల చేతుల్లో ఉందని.. ప్రయాణికుల రక్షణ విషయంలో రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!