Home
Latest News
Latest News News
-
CM Jagan Stone Attack : సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి అరెస్ట్
గత శనివారం సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్తో పాటు… -
Ravi kishan: మరో వివాదంలో చిక్కుకున్న బన్నీ విలన్ ..
తెలుగు విలన్ రవికిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా నటించాడు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన రవి కిషన్ రేసుగుర్రం చిత్రంలో శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు… ఆ సినిమా క్రేజ్ తోనే మరిన్ని హిట్ సినిమాల్లో నటించారు. విలన్ గా మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఈయన ప్రజల ఆదరణతో ముందుకు సాగుతున్నాడు.. ఇప్పుడు తాజాగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రవి కిషన్ ఒక వివాదంలో… -
Seediri Appalaraju : బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పలాస బహిరంగ సభ పెట్టారన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారన్నారు. రాష్ర్టాన్ని పద్నాలుగెండ్లు ఎలా దోచుకున్నారో ప్రజలు చూశారని ఆయన విమర్శించారు. పెత్తందారులు రాష్ర్టాన్ని ఎలా సంకనాకించారో చుసామని, బాబు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్ అన్నారు. రూల్స్ అతిక్రమించి ఒరల్ ఇనస్ట్రక్షన్ సిఎం ఇచ్చారని రాసిందెవరని ఆయన ప్రశ్నించారు. పివి… -
Volunteer Resign : సుమారు 1200 మంది వాలంటీర్ల రాజీనామా
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… -
Janasena : నేడు జనసేన గాజుగ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. నేడు జనసేన… -
Bramhanandam : డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్రహ్మీ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కామెడీ మూవీస్ వరుసగా విడుదల అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలోకి విడుదలయ్యే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. ప్రియమణి భామకలాపం తర్వాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.. వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా… -
Ratika Rose: నక్క తోక తొక్కిన బిగ్ బాస్ బ్యూటీ.. ఆ హీరో సినిమా ఛాన్స్..
రతికా రోజ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాక యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆమెను మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలని యూత్ కోరుకుంటున్నారు.. బిగ్ బాస్ లో అందాలతో పాటుగా లవ్ ట్రాక్ కూడా నడిపింది.. అదే సీజన్ కు హైలెట్ అయ్యింది.. అలాగే తను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ త్వరగా… -
Botsa Satyanarayana : స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..?
చంద్రబాబు నిన్న గాజువాకలో మీటింగ్ పెట్టినపుడు స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయివేటికరణకు వ్యతిరేకమా, అనుకూలమా? అని మంత్రి బొత్స అన్నారు. ద్వంద వైఖరి ని ఖండిస్తున్నామని, మా పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ ప్రయివేటి కరణకు వ్యతిరేకమన్నారు. ప్రజాస్వామ్యం లో, ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమం లు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.… -
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం.. ప్రచార హోరుకు సమాయత్తం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది. -
Gudivada Amarnath : ప్రజాస్పందన ఉన్న జగన్ సింపతీ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు
జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి మీద చంద్రబాబు వ్యాఖ్యలు హేయమైనవని, ప్రజాస్పందనతో వున్న జగన్మోహన్ రెడ్డి సింపతీ కోసం ప్రయత్నం చేయాలిసిన అవసరం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాజువాక మీటింగ్ లో తనపై తానే రాయి వేయించుకుని ప్రచారం కోసం వాడుకుంటున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. రాయి చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించే ప్రయత్నంలో చంద్రబాబు వున్నాడని, రాళ్ళు విసిరితే నో….దాడి చేస్తెనో ఇంట్లో…
తాజావార్తలు
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!