Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Tea Powder: చాయ్.. ఓ రిలాక్సేషన్… వర్క్ మోడ్లో నుంచి కాస్త రీఎనర్జైజ్ కావాలంటే టీ పడాల్సిందే..!! ముఖ్యంగా ఆఫీసులలో పని చేసే వారు.. రోడ్డు పక్కన ఉన్న టీ హోటల్స్లో చాయ్ తాగుతుంటారు. కానీ ఆ టీ సేఫేనా? అందులో వేసే టీ పౌడర్ నాణ్యమైనదేనా? ఇలా ఎవరూ డౌట్ పడి ఉండరు. కానీ ఆ టీ పౌడర్ను కూడా కొంత మంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడ్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ నకిలీ టీ పొడి దందాని పోలీసులు బయట పెట్టారు. టీ పొడి కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు.
READ ALSO: TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం
Also Read
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక ప్రాంగణంపై దాడి చేసింది. సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. అధిక లాభాల కోసం టీ పొడి కల్తీ చేస్తున్నట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కోకోపీట్ అంటే కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేసి.. అందులోని వ్యర్థాలను తొలగిస్తాడు. దానికి వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి ‘సన్సెట్ ఎల్లో’ , ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగిస్తున్నట్లు తేలింది.
ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద 120 కిలోలు రంగు కలిపిన టీ పొడి, సహజమైన టీ పొడి 30 కిలోలు, కోపీట్ మిశ్రమం 138 కిలోలు, సన్సెట్ ఎల్లో కలర్ 800 గ్రాములు, టార్ట్రాజైన్ కలర్ 700 గ్రాములు, బెల్లం బాక్సులు 12 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!