కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పెన్షన్లు, రేషన్ బియ్యం పంపిణీపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో జూన్ 1న బుధవారం నాడు పెన్షన్లను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి ప్రజా పంపిణీ విధానం ద్వారా కార్డుదారులకు బియ్యం వీఆర్వో ధృవీకరణ ద్వారా పంపిణీ జరుగుతుందని వివరించారు. Minister Gudivada Amarnath: విశాఖ ఇమేజ్ను…
కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసిన విషయం విదితమే! వారం రోజులు అవుతున్నా, ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించలేదు. దీంతో ఉద్యోగులు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. వారం రోజులైనా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే…
ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్…
కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి…
అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్…
జిల్లా పేరు మార్పు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించింది… తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.. ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.. తప్పు మీదంటే.. మీదేనంటూ దూషించుకుంటున్నారు నేతలు.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. అసలు కోనసీమ విధ్వంసం ఊహించ లేదు, హఠాత్తుగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ధర్నాలు, నిరాహార…
జిల్లా పేరు మార్పు వ్యవహారంలో కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జిల్లా కేంద్రమైన అమలాపురం అట్టుడికిపోయింది.. విధ్వంసానికి దారితీసింది.. అయితే, ఈ ఘటనపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నా.. ప్రస్తుతం మాత్రం అమలాపురంలో ప్రశాంత వాతావరణం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. Read Also:…
అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా…
అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆందోళనలు, విధ్వంసంలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఉంది.. జరిగిన సంఘటన తీరు, ప్రతిపక్ష నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డ ఆయన.. పోలీసులు సంయమనం…