Crop Holiday: గిట్టుబాటు ఎండమావి.. క్రాప్ హాలీడేకి మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్రాప్ హాలీడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో క్రాప్ హాలిడే పాటిస్తారని కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రకటించింది. గత నెలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని…దీనితో దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారని రైతు పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో తదుపరి పంట వేయడానికి రైతుల వద్ద డబ్బులు లేవని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో రైతులు ఉన్నారని వారు పేర్కొన్నారు.ఇటీవల ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పండించిన పంట అమ్మితే సాగు ఖర్చులు కూడా రావడం లేదని లాభం మాట దేముడెరుగు అని రైతులు వాపోతున్నారు.
పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక వర్షాలు, తుఫానుల సీజన్ లో వరి చేలు ముంపునకు గురయ్యి పంటను నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి 2552 రూపాయలు ఖర్చు అవుతోందని ప్రభుత్వ నివేదికలలో వెల్లడిస్తూ…రైతుకు మాత్రం మద్దతు ధర క్వింటాలు కు 1910 రూపాయలు ఇస్తున్నారని దీనితో ప్రతీ రైతు క్వింటాలుకు 650 రూపాయలు నష్టం వస్తోందని రైతులు విశ్లేషిస్తున్నారు. గత రబీ లో బొండాలు రకం పండిస్తే కొనేది లేదని అధికారులు ప్రకటించి తమచేత బలవంతంగా 1121 రకం వరి సాగు చేయించారని ఇది దిగుబడి రాక తాము ఎకరానికి 15 వేల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరిసాగు గిట్టుబాటు కాక 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పట్లో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. జాతీయ స్థాయిలోని 13 పార్టీల నాయకులు కోనసీమ వచ్చి ఇక్కడ క్రాప్ హోలీడే కు దారితీసిన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మోహన్ కందా కమిటీ ని నియమించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపాలని కోరింది. అయినప్పటికీ నేటికీ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. పంటకు గిట్టుబాటు ధర అనేది అందని ద్రాక్షగానే ఉంది. దీనితో మరోసారి క్రాప్ హాలిడే కు కోనసీమ రైతులు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!