Internet Open: అక్కడ ఇంటర్నెట్ కష్టాలకు చెక్
కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి.
గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసారు పోలీసులు… సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పూర్తిగా నెట్ బంద్ అయింది. రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలిగింది. దాంతో గత రెండు వారాలుగా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. పాస్ పోర్ట్ కేంద్రం పని చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలాపురంలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రం ఉంది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ పేమెంట్ లు కాక వ్యాపారాలు తగ్గిపోయాయి.ప్రతిదానికి నెట్ కావాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అతి జాగ్రత్తతో తమకు నష్టం తెస్తున్నారని జిల్లా వాసులు మండిపడ్డారు.
అయితే గత నాలుగు రోజులుగా మండలాల వారీగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు పోలీసులు. ముందుగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లో ఇంటర్నెట్ ఇచ్చారు. తర్వాత విడతలవారీగా జిల్లా మొత్తం కవర్ చేశారు. ఇప్పటికి మరో నాలుగు మండలాలు పెండింగ్ ఉండగా వాడికి కూడా ఇంటర్నెట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత నెట్ వచ్చింది.. విదేశాలలో తమ బంధువులు ఉన్న వారు రోజు వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. కాని గత కొద్ది రోజులుగా ఆ సదుపాయానికి బ్రేక్ పడింది.. సాష్ట్ వేర్ ఉద్యోగులు సైతం ల్యాప్ టాప్ పట్టుకుని నెట్ కోసం తిరిగేవారు. గోదావరి గట్టు దగ్గర కూర్చుని తమ పనులు చక్క బెట్టుకునేవారు. ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయంతో రిలీఫ్ అయ్యారు.. యధావిధిగా తమ పనులు తాము చేసుకోవచ్చని ఆనందపడుతున్నారు.. కొద్ది రోజులు పాత కాలానికి వెళ్ళిపోయామని అంటున్నారు…తిరిగి ఆధునిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు.
మొత్తానికి ఆందోళనలు సర్దుకోవడంతో పోలీసులు నెట్ సేవలు పునరుద్ధరించారు. దాంతో జిల్లావాసులకు ఎక్కడలేని సంతోషం వచ్చింది.. తిరిగి యధావిధిగా పరుగుల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత నెట్ సేవలతో సంబరపడిపోతున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!