Internet Open: అక్కడ ఇంటర్నెట్ కష్టాలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి.
గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసారు పోలీసులు… సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పూర్తిగా నెట్ బంద్ అయింది. రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలిగింది. దాంతో గత రెండు వారాలుగా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. పాస్ పోర్ట్ కేంద్రం పని చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలాపురంలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రం ఉంది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ పేమెంట్ లు కాక వ్యాపారాలు తగ్గిపోయాయి.ప్రతిదానికి నెట్ కావాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అతి జాగ్రత్తతో తమకు నష్టం తెస్తున్నారని జిల్లా వాసులు మండిపడ్డారు.
అయితే గత నాలుగు రోజులుగా మండలాల వారీగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు పోలీసులు. ముందుగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లో ఇంటర్నెట్ ఇచ్చారు. తర్వాత విడతలవారీగా జిల్లా మొత్తం కవర్ చేశారు. ఇప్పటికి మరో నాలుగు మండలాలు పెండింగ్ ఉండగా వాడికి కూడా ఇంటర్నెట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత నెట్ వచ్చింది.. విదేశాలలో తమ బంధువులు ఉన్న వారు రోజు వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. కాని గత కొద్ది రోజులుగా ఆ సదుపాయానికి బ్రేక్ పడింది.. సాష్ట్ వేర్ ఉద్యోగులు సైతం ల్యాప్ టాప్ పట్టుకుని నెట్ కోసం తిరిగేవారు. గోదావరి గట్టు దగ్గర కూర్చుని తమ పనులు చక్క బెట్టుకునేవారు. ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయంతో రిలీఫ్ అయ్యారు.. యధావిధిగా తమ పనులు తాము చేసుకోవచ్చని ఆనందపడుతున్నారు.. కొద్ది రోజులు పాత కాలానికి వెళ్ళిపోయామని అంటున్నారు…తిరిగి ఆధునిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు.
మొత్తానికి ఆందోళనలు సర్దుకోవడంతో పోలీసులు నెట్ సేవలు పునరుద్ధరించారు. దాంతో జిల్లావాసులకు ఎక్కడలేని సంతోషం వచ్చింది.. తిరిగి యధావిధిగా పరుగుల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత నెట్ సేవలతో సంబరపడిపోతున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?