Internet Open: అక్కడ ఇంటర్నెట్ కష్టాలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి.
గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసారు పోలీసులు… సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పూర్తిగా నెట్ బంద్ అయింది. రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలిగింది. దాంతో గత రెండు వారాలుగా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. పాస్ పోర్ట్ కేంద్రం పని చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలాపురంలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రం ఉంది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ పేమెంట్ లు కాక వ్యాపారాలు తగ్గిపోయాయి.ప్రతిదానికి నెట్ కావాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అతి జాగ్రత్తతో తమకు నష్టం తెస్తున్నారని జిల్లా వాసులు మండిపడ్డారు.
అయితే గత నాలుగు రోజులుగా మండలాల వారీగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు పోలీసులు. ముందుగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లో ఇంటర్నెట్ ఇచ్చారు. తర్వాత విడతలవారీగా జిల్లా మొత్తం కవర్ చేశారు. ఇప్పటికి మరో నాలుగు మండలాలు పెండింగ్ ఉండగా వాడికి కూడా ఇంటర్నెట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత నెట్ వచ్చింది.. విదేశాలలో తమ బంధువులు ఉన్న వారు రోజు వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. కాని గత కొద్ది రోజులుగా ఆ సదుపాయానికి బ్రేక్ పడింది.. సాష్ట్ వేర్ ఉద్యోగులు సైతం ల్యాప్ టాప్ పట్టుకుని నెట్ కోసం తిరిగేవారు. గోదావరి గట్టు దగ్గర కూర్చుని తమ పనులు చక్క బెట్టుకునేవారు. ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయంతో రిలీఫ్ అయ్యారు.. యధావిధిగా తమ పనులు తాము చేసుకోవచ్చని ఆనందపడుతున్నారు.. కొద్ది రోజులు పాత కాలానికి వెళ్ళిపోయామని అంటున్నారు…తిరిగి ఆధునిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు.
మొత్తానికి ఆందోళనలు సర్దుకోవడంతో పోలీసులు నెట్ సేవలు పునరుద్ధరించారు. దాంతో జిల్లావాసులకు ఎక్కడలేని సంతోషం వచ్చింది.. తిరిగి యధావిధిగా పరుగుల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత నెట్ సేవలతో సంబరపడిపోతున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!