MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు.
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఎన్డీయేకు లోక్సభ, రాజ్యసభల్లో ఎంపీల బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అవుతుంది. అయితే, బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కేరళలోని ప్రముఖ కాథలిక్ చర్చి నడిపే దినపత్రిక వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఆర్టికల్ ప్రచురించింది. ఈ బిల్లుని ‘‘లౌకికవాదానికి కీలకమైన పరీక్ష’’గా అభివర్ణించింది. దీనిని వ్యతిరేకిస్తే మతపరమైన మౌలిక వాదాన్ని ఆమోదించినట్లు అవుతుందని…
Priyanka Gandhi: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్సభ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కాన్వాయ్ను అడ్డుకున్నందుకు త్రిస్సూర్ జిల్లాలో ఒక యూట్యూబర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఈరోజు (మార్చ్ 31) తెలిపారు.
Empuraan Row: ఎంపురాన్ మూవీపై వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
L2: Empuraan: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎల్2:ఎంపురాన్’ వివాదానికి తెరతీసింది. కేరళలో అధికార కమ్యూనిస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాని స్వాగతించాయి. అయితే, అదే సమయంలో ‘‘సంఘ్ ఎజెండా’’ని సినిమా బహిర్గతం చేసిందని ఆ పార్టీలు, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. లూసిఫర్ సినిమా సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాలో పరోక్షంగా 2002 గుజరాత్ అల్లర్లను సూచిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఈ సినిమా చర్చించింది.
Kerala: 2005లో కేరళలో జరిగిన బీజేపీ కార్యకర్త ఎలాంబిలాయి సూరజ్ హత్య కేసులో 9 మంది సీపీఎం కార్యకర్తలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో సీఎం పినరయి విజయన్ ప్రెస్ సెక్రటరీ సోదరుడు కూడా ఉన్నాడు. శుక్రవారం వీరిందరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిని వారిలో టీకే రజీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇతను 2012లో జరిగిన టిపీ చంద్రశేఖరన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో దోషి పీఎం మనోరాజ్, ఇతను సీఎం…
Fish bite: చేప కాటు ఏకంగా ఓ వ్యక్తి చేయినే లేకుండా చేసింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో 38 ఏళ్ల రైతు చేపకాటుకు గురైన తర్వాత ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకింది. చేప కాటుకు గురైన చేయిని మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చింది. తలస్సేరిలోని మడపీడిక నివాసి అయిన రజీష్, ఫిబ్రవరి ప్రారంభంలో ఒక గుంటను శుభ్రం చేస్తున్నప్పుడు, స్థానికంగా కడు అని పిలిచే చేప కరిచినట్లు చెప్పాడు. అయితే, మొదట్లో గాయం చిన్నదిగా కనిపించిందని, ఆ…
కొందరు అందం కోసం.. స్లిమ్ గా మారడానికి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ముల్లో చేరి చెమటోడుస్తుంటారు. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక గూగుల్, యూట్యూ్బ్ చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేరీతిలో ఓ యువతి స్లిమ్ గా మారడానికి ఆన్ లైన్ డైట్ పాటించింది. ఆమె బరువు పెరుగుతుందనే భయంతో భోజనం కూడా మానేసింది.…
SLBC టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
UAE: వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు భారతీయ వ్యక్తులను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మరణశిక్ష విధించిందని, వారిని ఉరి తీసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.