MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..
- సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ..
- కేరళ నుంచి ఈ పదవి అందుకున్న రెండో వ్యక్తిగా గుర్తింపు..
- బేబీకి శుభాకాంక్షలు చెప్పిన స్టాలిన్, పినరయి, శశి థరూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు. అంతకుముందు కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సీపీఎంకు నాయకత్వం వహించారు. గతేడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ప్రకాష్ కారత్ పదవిని నిర్వహిస్తున్నాడు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేతగా బేబీ రికార్డ్ సృష్టించారు.
Read Also: Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
కేరళలో అధికారి సీపీఎం పార్టీలో బేబీ సీనియర్ నేతగా ఉన్నారు. ఈయన గతంలో 2006-2011 వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1986-1998 మధ్య రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బేబీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని కొల్లాం జిల్లాలో జన్మించిన ఎంఏ బేబీ విద్యార్థి దశ నుంచే సీపీఎం పార్టీతో సంబంధం ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. పార్టీ స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలో కీలక పదవులు నిర్వహించారు.
పార్టీ చీఫ్తో సహా 85 మంది సభ్యుల కొత్త కేంద్ర కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇది 18 మంది సభ్యుల పోలిట్ బ్యూరోని ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన పోలిట్ బ్యూరోలో పినరయి విజయన్తో పాటు సీనియర్ నేతలు బివి రాఘవులు, తపన్ సేన్, నీలోత్పల్ బసు, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమ్, ఎంవి గోవిందన్, అమ్రా రామ్, విజూ కృష్ణన్, మరియం ధావలే, యు వాసుకిత్, కె బాలకృష్ణన్, అరుణ్ దీప్, చోవుద్దాచ్, జె.బాలకృష్ణన్, ఎంఏ బేబీ ఉన్నారు.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!