MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..
- సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ..
- కేరళ నుంచి ఈ పదవి అందుకున్న రెండో వ్యక్తిగా గుర్తింపు..
- బేబీకి శుభాకాంక్షలు చెప్పిన స్టాలిన్, పినరయి, శశి థరూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు. అంతకుముందు కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సీపీఎంకు నాయకత్వం వహించారు. గతేడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ప్రకాష్ కారత్ పదవిని నిర్వహిస్తున్నాడు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేతగా బేబీ రికార్డ్ సృష్టించారు.
Read Also: Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
కేరళలో అధికారి సీపీఎం పార్టీలో బేబీ సీనియర్ నేతగా ఉన్నారు. ఈయన గతంలో 2006-2011 వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1986-1998 మధ్య రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బేబీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని కొల్లాం జిల్లాలో జన్మించిన ఎంఏ బేబీ విద్యార్థి దశ నుంచే సీపీఎం పార్టీతో సంబంధం ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. పార్టీ స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలో కీలక పదవులు నిర్వహించారు.
పార్టీ చీఫ్తో సహా 85 మంది సభ్యుల కొత్త కేంద్ర కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇది 18 మంది సభ్యుల పోలిట్ బ్యూరోని ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన పోలిట్ బ్యూరోలో పినరయి విజయన్తో పాటు సీనియర్ నేతలు బివి రాఘవులు, తపన్ సేన్, నీలోత్పల్ బసు, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమ్, ఎంవి గోవిందన్, అమ్రా రామ్, విజూ కృష్ణన్, మరియం ధావలే, యు వాసుకిత్, కె బాలకృష్ణన్, అరుణ్ దీప్, చోవుద్దాచ్, జె.బాలకృష్ణన్, ఎంఏ బేబీ ఉన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!