Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
- మరికొన్ని గంటల్లో కేరళకు రుతుపవనాలు
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చల్లని వాతావరణం నెలకొనడంతో ప్రజలు అంతగా ఇబ్బంది పడిన పరిస్థితులు కనిపించలేదు. ఇక రోహిణి కార్తె మే 25న(ఆదివారం) రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రాహిణి కార్తె సమయంలో ఎండలు భగభగ మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాళ్లు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించలేదు. ప్రతి రోజు మేఘాలు కమ్ముకోవడంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి: TG POLYCET Result 2025: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
Also Read
ఇక మరికొద్ది సేపట్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 16 సంవత్సరాల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని.. షెడ్యూల్ కంటే 8 రోజులు ముందే వచ్చేస్తున్నాయని ఐఎండీ తెలిపింది. 2009, 2001లో కూడా ఇలానే రుతు పవనాలు త్వరగా వచ్చాయి. మే 23నే రుతుపవనాలు వచ్చేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..
సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ముందుగానే రుతుపవనాలు రావడంతో సంతోషకరమని ఐఎండీ తెలిపింది. దీంతో కేరళ, దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 6 రోజులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గోవా, గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్లలో కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
తొలిసారిగా 1918 మే 11న వర్షాలు కురిసిన రికార్డు ఉంది. మరోవైపు ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ సమయంలో రుతుపవనాలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాల్లో అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు వచ్చింది 2016లోనే. జూన్ 9న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక రుతుపవనాలు రాకతో మే 29 వరకు కేరళ, తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!