Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
- మరికొన్ని గంటల్లో కేరళకు రుతుపవనాలు
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చల్లని వాతావరణం నెలకొనడంతో ప్రజలు అంతగా ఇబ్బంది పడిన పరిస్థితులు కనిపించలేదు. ఇక రోహిణి కార్తె మే 25న(ఆదివారం) రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రాహిణి కార్తె సమయంలో ఎండలు భగభగ మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాళ్లు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించలేదు. ప్రతి రోజు మేఘాలు కమ్ముకోవడంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి: TG POLYCET Result 2025: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
ఇక మరికొద్ది సేపట్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 16 సంవత్సరాల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని.. షెడ్యూల్ కంటే 8 రోజులు ముందే వచ్చేస్తున్నాయని ఐఎండీ తెలిపింది. 2009, 2001లో కూడా ఇలానే రుతు పవనాలు త్వరగా వచ్చాయి. మే 23నే రుతుపవనాలు వచ్చేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..
సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ముందుగానే రుతుపవనాలు రావడంతో సంతోషకరమని ఐఎండీ తెలిపింది. దీంతో కేరళ, దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 6 రోజులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గోవా, గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్లలో కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
తొలిసారిగా 1918 మే 11న వర్షాలు కురిసిన రికార్డు ఉంది. మరోవైపు ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ సమయంలో రుతుపవనాలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాల్లో అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు వచ్చింది 2016లోనే. జూన్ 9న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక రుతుపవనాలు రాకతో మే 29 వరకు కేరళ, తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?