HYDRA : మాదాపూర్లో హైడ్రా సంచలనం.. రూ. 2200 కోట్ల విలువైన భూమి క్లియర్.!
- మొండికుంట చెరువు పరిధిలో 11 ఎకరాల భూమి స్వాధీనం
- రూ.2200 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై అక్రమ నిర్మాణాలు నేలమట్టం
- శాటిలైట్ చిత్రాలతో ఆక్రమణల గుర్తింపు.. హైడ్రా శాస్త్రీయ చర్యలు
- స్వాధీనం చేసిన స్థలంలో పార్కులు, చెరువు సుందరీకరణకు ప్రజల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. మొండికుంట చెరువు , దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి విముక్తం చేస్తూ గురువారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా సుమారు 11 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 2200 కోట్లు ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది.
సర్వే నంబర్ 53లోని మొండికుంట చెరువు పరిధి , సర్వే నంబర్ 55లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏళ్ల తరబడి అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు FTL పరిధిలోని ఒక ఆలయాన్ని హద్దుగా చూపించి, కబ్జాదారులు తెలివిగా ఆక్రమణలకు పాల్పడ్డారు. అక్కడ వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా పక్కా షాపులను నిర్మించి, వాటి ద్వారా నెలకు లక్షలాది రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిలో ప్రధానంగా మెకానిక్ షెడ్లు, ఐరన్ , స్టీల్ దుకాణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, జేసీబీలతో వాటిని నేలమట్టం చేశారు.
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
Parijatha Yogam 2026: రేపే పారిజాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు.!
ఈ ఆక్రమణల నిర్ధారణ కోసం హైడ్రా శాస్త్రీయ పద్ధతులను అనుసరించింది. ఈ ఏడాది జనవరి 31న రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా, ఎన్ఆర్ఎస్సీ (NRSC) శాటిలైట్ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించింది. గత కొన్ని ఏళ్లలో చెరువు ఆక్రమణకు గురైన తీరును శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిర్ధారించుకున్నాకే ఈ చర్యలకు పూనుకుంది. అయితే, ఈ కూల్చివేతలకు ముందే కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి, సామాగ్రిని తరలించుకోవడానికి గడువు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరిగాయి. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ 11 ఎకరాల స్థలంలో ప్రజా అవసరాల కోసం పార్కులు అభివృద్ధి చేయాలని, అలాగే మొండికుంట చెరువును ప్రక్షాళన చేసి సుందరీకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!