భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాను లాగా చిన్న చిన్న గొడవలు చోటుచేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఘోరానికి దారితీస్తుంది. గొడవ పడేటప్పుడు సహనం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపో, చావుపో అని అంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? ఈ విషయంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. Also Read:CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్…
త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. చాలా రోజులుగా పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ను దగ్గరకు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ కేరళ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం మోడీ తిరువనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టేజ్పై మోడీకి నాయకులు సత్కారాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక మహిళ.. మోడీ పాదాలకు నమస్కరించింది.
కేరళలో మార్పు అనివార్యమని ప్రధాని మోడీ అన్నారు. కేరళలో జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. ఈసారి ఎలాగైనా కేరళలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందుకు తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు.
Ramdas Athawale: కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాలంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ బందు అథవాలే బుధవారం సూచించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
Kerala Woman: కేరళలో ఇటీవల బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో, ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందలు రావడంతో 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
Road Accident: శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన TGSPDCL ఉద్యోగి అశోక్ మృతి చెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జనవరి 7 ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ – పెరుంబవూర్ MC రోడ్డులోని త్రిక్కలత్తూర్, కవుంపాడు వద్ద జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డవారిలో కొడుకు, అల్లుడు…
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు.
Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా…
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.