బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం కేటీఆర్ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రీట్వీట్ చేశారు. కౌంటర్ అటాక్ చేశారు. కిషన్ రెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. టీఆర్ఎస్ పాలనలో “ఇంటికో ఉద్యోగం లేదు” “నిరుద్యోగ భృతి లేదు” “ఉచిత ఎరువులు లేదు” “ఋణమాఫీ లేదు” “దళిత ముఖ్యమంత్రి లేదు” “దళితులకు మూడెకరాల భూమి లేదు” “పంటనష్ట పరిహారం లేదు” “దళితబంధు లేదు”…
తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణం అయినా ఇస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బంగారు తెలంగాణ అయిందా? వెండి తెలంగాణ అయినా అయిందా? అప్పుల తెలంగాణ అయింది. అప్పులు ఎందుకు అయిపోయాయి? నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని పాల్ ప్రశ్నించారు. 8 ఏళ్ళ వరకూ నిరుద్యోగులు గుర్తుకురాలేదా? నాకు సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదు. నేను రాకుంటే ఇంకా దోచుకుంటారా? ఇంకా తెలంగాణను అమ్మేస్తారా? మీకోసం నేను వచ్చా. ఒక్కొక్కరు వందమంది వెయ్యిమందికి చెప్పండి. అన్నివర్గాల…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్తో…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో రైతులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో బీజేపీ నేతలు కూడా దీక్షకు దిగారు. దీంతో మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్రమంత్రి మురళీధరన్. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కనీస మద్దతు ధరలు పెంచింది. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. పీయూష్ గోయల్ ధాన్యం…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించటం ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను మీ దృష్టి కి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు లేనిది రాజ్యం లేదు ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటాం నెలతల్లిని నమ్ముకుని కష్టపడి బ్రతికే రైతన్నలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ వారికి భారంగా మారకూడదు. ఇప్పటికే వడ్లు కొనుగోలు విషయంలో…
దేశంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్.…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్ దంపతులు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్కు వెళ్లనున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఫ్యామిలీ బయల్దేరనుంది.. ఇక, కుటుంబసభ్యులతో కలిసి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. మహలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.. కాగా, ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు కేసీఆర్……