Modi : ప్రధాని మోడీ వస్తున్నారని సీఎం కేసీఆర్ వేరే రాష్ట్రానికి వెళ్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది.
మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే …సీఎం కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారు కావడం, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరతీసినట్టయ్యింది. కొంత కాలంగా టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం మారింది. ఇదే సమయంలో మోడీ రావడం, కేసీఆర్ రాష్ట్రంలో ఉండకపోవడం, అందులో భాగంగానే జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
మొదట్లో మోడీ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నా, ఆ తర్వాత కాలక్రమేణా ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మోడీ టార్గెట్ గా కేసీఆర్ బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇటువంటి పరిణామాల్లోనే మోడీ నిర్వహించే పలు వీడియో కాన్ఫరెన్స్ లకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్లలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, మోడీకి స్వాగతం తెలిపేందుకు పంపారు కేసీఆర్. ఇటు రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు మోడీ హాజరు కాగా, కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. మోడీని కలిసేందుకు ఆసక్తిగా లేని కేసీఆర్, ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. తాజాగా మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో, కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది..
మే 26న మోడీ హైదరాబాద్ కు రావడం ఖరారైంది. కేసీఆర్ అదేరోజు బెంగుళూరు పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీని కలిసే ఉద్దేశ్యం లేనందుకే, కేసీఆర్ బెంగుళూరు టూర్ పెట్టుకున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో మాదిరిగానే మోడీని రిసీవ్ చేసుకునేందుకు, క్యాబినెట్ మినిస్టర్ ను పంపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ హైదరాబాద్, కేసీఆర్ బెంగుళూరు పర్యటన యాదృచ్చికంగా జరుగుతోందా…లేక ప్లాన్ ప్రకారమే అంతా అవుతుందా అన్న చర్చ వాడివేడిగా సాగుతోంది
మొత్తంగా మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
- Tags
- ISB
- kcr
- modi
- Modi Telangana
- Politics
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!