Modi : ప్రధాని మోడీ వస్తున్నారని సీఎం కేసీఆర్ వేరే రాష్ట్రానికి వెళ్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది.
మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే …సీఎం కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారు కావడం, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరతీసినట్టయ్యింది. కొంత కాలంగా టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం మారింది. ఇదే సమయంలో మోడీ రావడం, కేసీఆర్ రాష్ట్రంలో ఉండకపోవడం, అందులో భాగంగానే జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది
Also Read
మొదట్లో మోడీ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నా, ఆ తర్వాత కాలక్రమేణా ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మోడీ టార్గెట్ గా కేసీఆర్ బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇటువంటి పరిణామాల్లోనే మోడీ నిర్వహించే పలు వీడియో కాన్ఫరెన్స్ లకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్లలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, మోడీకి స్వాగతం తెలిపేందుకు పంపారు కేసీఆర్. ఇటు రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు మోడీ హాజరు కాగా, కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. మోడీని కలిసేందుకు ఆసక్తిగా లేని కేసీఆర్, ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. తాజాగా మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో, కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది..
మే 26న మోడీ హైదరాబాద్ కు రావడం ఖరారైంది. కేసీఆర్ అదేరోజు బెంగుళూరు పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీని కలిసే ఉద్దేశ్యం లేనందుకే, కేసీఆర్ బెంగుళూరు టూర్ పెట్టుకున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో మాదిరిగానే మోడీని రిసీవ్ చేసుకునేందుకు, క్యాబినెట్ మినిస్టర్ ను పంపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ హైదరాబాద్, కేసీఆర్ బెంగుళూరు పర్యటన యాదృచ్చికంగా జరుగుతోందా…లేక ప్లాన్ ప్రకారమే అంతా అవుతుందా అన్న చర్చ వాడివేడిగా సాగుతోంది
మొత్తంగా మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
- Tags
- ISB
- kcr
- modi
- Modi Telangana
- Politics
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..