Sabitha Indra Reddy: అయ్యా మోదీ.. మీ వాటా గుండు సున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి బచావో బేటి పడావో’ అనేది నినాదానికే పరిమితం చేసారన్నారు.
దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు అన్యాయం చేశారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అనేక మంది పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఉన్నత విద్యను దూరం చేసిన ఘనత మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సాంకేతికతో ముందుకెళ్తామని, అంద విశ్వాసాలను నమ్మబోమని చెప్పిన ప్రధాని.. నాడు కరోనా సమయంలో చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించడం ఏ సాంకేతిక కిందకి వస్తుందో చెప్పాలని నిలదీశారు. విభజన హామీలు మరిచి, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీలు రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా, ఇవ్వకుండా చిల్లిగవ్వ సహాయం చేయని వారు.. నేడు తెలంగాణ గడ్డ మీద అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సబితా ఎద్దేవా చేశారు. 8 ఏళ్ళలో తెలంగాణాకు ఏం చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్తే బాగుండేదన్నారు. రాష్ట్రంపై అన్ని విషయాల్లో వివక్ష చూపుతూ, విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో మీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వంద శాతం పని చేస్తున్నారని ఆరోపించారు. టూరిస్టుల మాదిరి కాకుండా, భాద్యతయుతమైన పదవిలో ఉన్న వారు విధానాలతో వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తే బాగుంటుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. తెలంగాణ రాష్టం బీజేపీ పాలిత రాష్టాల కన్నా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సబితా అన్నారు. ఒక టెక్నాలజీ హబ్నే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం అయ్యాయని.. మా అభివృద్ధిలో మీ వాటా – సహకారం గుండు సున్నా అని ఎద్దేశా చేశారు. పని చేస్తోందెవరో? మాటలతో పబ్బం గడుపుతుందెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..