Kishan Reddy: మోడీ నీ గద్దె దించుతాడు అట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని మండిపడ్డారు. ఆయనకున్న అధికార దాహం మరొకరికి లేదని విమర్శించారు. మోడీ నీ గద్దె దించుతాడు అట… ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఉద్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు…
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్…
Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా…
మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని హైదర్ గుడాలో దానం నాగేందర్ చేతుల మీదుగా 900 వందల మందికి అసారా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషులు అర్హువులుగా గుర్తించి సీఎం కేసీఆర్ ఈ ఆసరా పథకం ముందుకు తెచ్చారన్నారు.…
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. తీవ్రవిషాదంలో ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబసభ్యులు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెబల్ స్టార్, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు…
గవర్నర్ తమిలి సై పై సీపీఐ సెక్రెటరీ కూనంనేని సాంబ శివరావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని మగ్ధుం భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ఎంత మేరకు ఉండాలో ఎంత మేరకే ఉండాలన్నారు. ఇది విమోచనో, విలీనమో గవర్నర్ కి ఎందుకు? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని అన్నారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికిరాదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను విలీన…
రాష్ట్ర గవర్నర్ తమిలిసై తను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాననే మర్చిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసీఆర్ ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తుంది..? అని ప్రశ్నించారు. మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్ లో…
KCR should walk forward for BJP free India: మోడీ సర్కార్ దుర్మార్గపు పాలన దేశంలో నడుస్తోందని, మోడీ నాయకత్వంలో దేశంలో రాక్షస పాలన కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల్కాసుమన్ మండిపడ్డారు. చేతకాని దద్దమ్మల అసమర్థ పాలన దేశంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంను కపావడానికి నడుము బిగించాల్సిన సమయం వచ్చిందని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ దేశం కోసం ఏమి కావాలో చెబుతున్నారని, కానీ మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశంలోని…
రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని, సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్…
గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సర్దుకునే లోపే అసెంబ్లీ ప్రారంభం అయ్యింది… వాయిదా పడిందని విమర్శించారు. బీఏసీ మీటింగ్ కి మమ్మల్ని ఆహ్వానించక పోవడంపై స్పీకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో ఒకరు, ఇద్దరు సభ్యులుగా ఉన్న పార్టీ లను బీఏసీ మీటింగ్ కి పిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పిలిచారని అన్నారు. సభ…