ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలైంది. అరాచకాలు సృష్టించిన తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లిపోయారు. 1996 నుంచి 2001 వరకు ఆ దేశంలో తాలిబన్ల పాలన సాగింది. ఆ సమయంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల హక్కులను కాలరాశారు. షరియా చట్టాల పేరుతో మహిళలను హింసించారు. ఐదేళ్లపాటు హత్యాకాండ సాగింది. అయితే, 20 ఏళ్ల తరువాత మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను కైవసం చేసుకోవడంతో మరోసారి ప్రతి…
ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్నది. ఎలాగైనా పంజ్షీర్ ప్రావిన్స్ను అక్రమించుకోవాలని తాలిబన్లు చూస్తున్నారు. తాలిబన్లకు పంజ్షీర్ మాత్రమే కాకుండా, వారి చెర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని విడిపించాలని పంజ్షీర్ దళం పోరాటం చేస్తున్నది. పంజ్షీర్ ప్రావిన్స్లో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ ఎనిమిది జిల్లాలలో పెద్ద ఎత్తున తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. అయితే, తాము పంజ్షీర్లోని 4 జిల్లాలను ఆక్రమించుకున్నామని, పంజ్షీర్ రాజధాని బజారక్ లోని గవర్నర్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించామని తాలిబన్లు చెబుతుంటే, పంజ్షీర్…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని,…
తాలిబన్లు అంటేనే చేతిలో గన్తో దర్శనమిస్తారు.. ఇక, వాళ్లకు కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా.. గన్నులనే వాడేస్తారు.. ఆప్ఘన్ను రాజధాని కాబూల్ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు పంజ్షేర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.. అక్కడ యుద్ధం ఓవైపు.. చర్చలు మరోవైపు సాగుతున్నాయి.. అయితే, త్వరలోనే ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోన్న తాలిబన్లు.. పంజ్షేర్ కూడా తమ వశమైందని శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశారు.. దీంతో.. తాలిబన్లు అంతా ఆనందోత్సాహాలతో…
ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు.…
ఆఫ్ఘనిస్థాన్లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 30 వరకు కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. అమెరికా దళాలు లేకపోవడంతో ప్రజలంతా ఏమయ్యారు… ఎటువెళ్లారు. తిరిగి ఇళ్లకు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత ప్రజలు రూటు మార్చి ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వైపు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇరాన్ సరిహద్దులకు ప్రజలు చేరుకోవడంతో అక్కడ భద్రతను…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాయి. పూర్తిగా సేనలు తప్పుకోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై ఉగ్రవాదుల దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించింది అమెరికా. సేనలు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులను తరిమికొట్టాయి. 2001లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచింది. అమెరికా సేనలు ఉపసంహరించుకునే సమయానికి తిరిగి 2001 ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 20 ఏళ్ల కాలంలో…
ఆగస్టు 31 వ తేదీ కంటే ముందే అమెరికా దళాలు ఆఫ్ఘన్ను వదిలి వెళ్లిపోయాయి. కాబూల్ ఎయిర్పోర్ట్లో చివరి సైనికుడితో సహా అందర్ని అమెరికా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వెళ్లే సమయంలో వీలైన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్లోనే వదిలేసింది. అయితే, వాటిని చాలా వరకు నిర్వీర్యం చేసింది. తిరిగి వినియోగించాలంటే దానికి తగిన టెక్నాలజీ,…
20 ఏళ్లుగా అమెరికా, నాటో దళాల సంరక్షణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా తప్పుకున్నాక తాలిబన్లు ఎయిర్పోర్ట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తాత్కాలిక శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను నియమిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాలిబన్లు ఎలా పరిపాలించబోతున్నారు అన్నది ఉత్కంఠంగా మారింది. తాలిబన్ల చెరలోకి ఆఫ్ఘన్ వెళ్లిన వెంటనే విదేశీ నిథులను అమెరికా ఫ్రీజ్ చేసింది.…