పోరాటంలో గాయపడితే నన్ను కాల్చేయండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని, వారు స్పందించలేదని తెలిపారు. రాష్ట్రపతి భవన్కు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. కాబూల్ నగరంలో ఎక్కడా పోలీసులు లేరని, కనీసం కమాండోలనైనా పంపించాలని పోలీస్ ఛీప్ కోరినట్టు ఆయన తెలిపారు. కానీ, తాను ఎవరికి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయిందని, అప్పటికే సమయం మించిపోవడంతో తాను, కాబూల్ వదలి పంజ్షీర్కు వెళ్లినట్టు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాలిబన్లకు లొంగిపోయేది లేదని, ఒకవేళ పోరాటంలో తాను గాయపడితే తనను రెండుసార్లు తలపై కాల్చి చంపాలని తన సహచరులకు తెలిపినట్టు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు.
Read: సెప్టెంబర్ 6, సోమవారం దినఫలాలు…
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!