టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
టీ20 వరల్డ్ కప్కు ముందు టీం ఇండియాకు మరో గట్టి దెబ్బే తగలింది. ఇప్పటికే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. మోకాలి సర్జరీ చేయించుకొని రెస్ట్ లో ఉన్నాడు. మరో ఆల్రౌండర్గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్ ఠాకూర్ కూడా గాయంతో ఆసీస్తో సిరీస్కు ముందే జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వెన్నునొప్పితో బూమ్రా కూడా తప్పుకోవడంతో… వరుస గాయాలు టీం ఇండియాను కలవరపెడుతున్నాయి. గత ప్రపంచకప్లో పేవలమైన ప్రదర్శనతో… గ్రూప్ స్టేజ్ లోనే భారత్ ఇంటిముఖం పట్టింది. ఓటమికి…
T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం…
T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర…
Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు జట్టును…
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. తొలుత టాస్…
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్లో భారత్ చాలా తప్పిదాలు చేసింది. బ్యాటింగ్ విభాగమైతే పూర్తిగా విఫలమైంది. పుజారా, రిషభ్ పంత్ పుణ్యమా అని.. కాస్తో కూస్తో స్కోరు వచ్చింది. మిగిలిన వాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఫీల్డింగ్లోనూ అదే రిపీట్ అయ్యింది. సరైన పొజిషన్లో ఫీల్డర్స్ పెట్టకపోవడం, మిస్ ఫీల్డ్స్ చేయడం మైనస్ పాయింట్స్. హనుమ విహారి అయితే అత్యంత కీలకమైన క్యాచ్ని మిస్ చేయడం, ఈ మ్యాచ్కే పెద్ద…
ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో మ్యాచ్కు తాత్కాలిక కెప్టెన్గా కొనసాగుతోన్న జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఓవర్లో 35 (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో) పరుగులు చేసి, టెస్టుల్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పుడు వికెట్ల పరంగా మరో ఘనత సాధించాడు. ఇప్పటివరకూ 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్గా…
ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను చూస్తే పాపం అని టీమిండియా అభిమానులు అనక మానరు. ఎందుకంటే గతంలో టీ20 ప్రపంచకప్లో బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి అతడికి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పటికీ ఆ ఓవర్ను అటు ఇంగ్లండ్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. తాజాగా బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ బౌలింగ్లోనే ఒకే ఓవర్లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక…