భారత్-పాక్ మ్యాచ్ కు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది, సూపర్ 8 వైపు దృఢంగా ముందుకు సాగుతుంది. కొలంబో పిచ్ ఆధారంగా పాకిస్థాన్తో జరిగే భారత ప్లేయింగ్ XIలో కొన్ని మార్పులు జరగవచ్చు. టీం ఇండియా అదనపు స్పిన్నర్ను రంగంలోకి దించవచ్చు. కుల్దీప్ యాదవ్ను తుది XIలో చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది…
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ చర్చకు కారణం బుమ్రా సతీమణి సంజనా గణేశన్. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బుమ్రా, సంజనా మైదానంలో మాట్లాడుకోవడమే నెట్టింట ఈ చర్చకు దారి తీసింది. సాధారణంగా విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ కఠిన నియమాలు అమలు చేస్తోంది.…
India vs Namibia: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్లో నమీబియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా భారత్ బ్యాటింగ్ చేయనుంది. AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..! టాస్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాస్ ఓడినా మ్యాచ్ గెలవడం ముఖ్యం అని అన్నారు. ఈ మ్యాచ్లో మంచు…
Jasprit Bumrah Yorker Injures Ishan Kishan: టీ20 ప్రపంచకప్ 2026 లో నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియా వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ నేరుగా అతడి ఎడమ కాలి బొటనవేలికి తాకింది. దాంతో కిషన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేయగా కాస్త కుదుటపడ్డాడు. నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన కిషన్.. కాసేపటికి మైదానంలోకి తిరిగి…
IND vs USA: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 మొదలయ్యింది. అయితే భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇప్పటికే మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, ఇప్పుడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్కు దూరమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. T20 World Cup Records: వరల్డ్కప్లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్లో పాకిస్థాన్కు చోటు!…
‘టీ20 వరల్డ్కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్కప్లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లోని నాలుగో మ్యాచ్కు విశాఖ వేదికైంది. రెండు రోజుల క్రితమే విశాఖ చేరుకున్న ఇరు జట్లు ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని అతడి ఫిట్నెస్పై మేనేజ్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. హార్దిక్…
Ind vs NZ 3rd T20I: గౌహతి వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు గట్టి అడ్డుకట్ట వేశారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. డెవన్ కాన్వే (1) హర్షిత్ రాణా బౌలింగ్లో ఔట్ కాగా, రచిన్ రవీంద్ర (4) కూడా త్వరగానే…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2025-26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్, అంతర్జాతీయ ప్రదర్శనలను ఆధారంగా చేసుకుని గ్రేడ్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి గ్రేడ్లలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లు, యువ ఆటగాళ్లకు బీసీసీఐ సమానంగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేడ్ Aలో నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారని సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్తో పాటు…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. గతంలో భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో కూడా ఓడించింది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంగా ఉపయోగపడనుంది. టీ20ల్లోనూ రెండు జట్ల మధ్య…