IND vs IRE: కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ స్టార్లకు పిలుపు! ఐర్లాండ్తో టీ20లకు భారత జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs IRE: Jasprit Bumrah Lead Indian Team In Ireland: వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. భారత జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు కొత్త కెప్టెన్ను నియమించారు. వెన్ను గాయంతో దాదాపు 11 నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
గతేడాది సెప్టెంబర్లో సొంతగడ్డపై చివరిగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయంతో మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకున్న బుమ్రా.. ఇటీవలే సాధన మొదలు పెట్టాడు. ఫిట్నెస్ సాధించిన అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. గాయాల నుంచి కోలుకోని స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు జట్టులో చోటు దక్కలేదు.
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
Also Read: Gold Today Rate: మగువలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
గాయంతో చాలా రోజులుగా జట్టుకు దూరమై ఎన్సీఏలో కోలుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2023లో సత్తాచాటిన శివమ్ దూబె కూడా చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన రింకు సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి భారత జట్టులోకి వచ్చారు. ఇక వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ఎంపికైన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు కూడా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఆడే జట్టులో చోటు దక్కింది.
ఐర్లాండ్తో టీ20లకు భారత జట్టు (India T20 Squad for Ireland):
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్.
Also Read: Maharashtra Girder Accident: కుప్పకూలిన గిర్డర్ యంత్రం.. 15 మంది మృతి!
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..