IND vs IRE: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Captain Jasprit Bumrah Set To Unique Record His Name In History Books: వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను 3-2 తేడాతో కోల్పోయిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరంభం అయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. మూడు మ్యాచ్లు జియో సినిమా, స్పోర్ట్స్18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్కు చేరింది.
ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 వంటి మెగా టోర్నీల నేపథ్యంలో సీనియర్లు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లతో సహా చాలా మంది రెగ్యులర్ ప్లేయర్లకు బీసీసీఐ ఈ సిరీస్లో విశ్రాంతి ఇచ్చింది. సీనియర్లు గైర్హాజరు కావడంతో బీసీసీఐ సెలక్టర్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించారు. గాయం కారణంగా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్తో మొదటి టీ20 ద్వారానే తన పేరుపై ఓ అరుదైన రికార్డు లిఖించుకోనున్నాడు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించిన తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలవనున్నాడు. టీ20లో ఇప్పటివరకు టీమిండియాకు 10 మంది నాయకత్వం వహించినా.. అందరిలో ఎవరూ కూడా స్పెసలిస్ట్ బౌలర్ లేరు. 9 మంది బ్యాట్స్మెన్ కాగా.. ఓ ఆల్రౌండర్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మొదటి కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్. 2007 టీ20 ప్రపంచకప్ నుంచి ఎంఎస్ ధోనీ సారథిగా ఉన్నాడు. మహీ గైర్హాజరీలో సురేశ్ రైనా, అజింక్యా రహానే కొన్ని మ్యాచ్ల్లో జట్టును నడిపించారు.
Also Read: APL 2023: నేటి మ్యాచ్కు శ్రీలీల.. భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ గెలిచే అవకాశం!
2017లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించారు. 2022లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్లకు కూడా జట్టు బాధ్యతలు అందుకున్నారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్గా చేశాడు. ఇందులో హార్దిక్ (ఆల్రౌండర్) మిన్నగా మిగతావారందరూ బ్యాట్స్మెన్లు అన్న విషయం తెలిసిందే. దాంతో జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డును తన పేరుపై లిఖించుకోనున్నాడు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!