IND vs IRE: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Captain Jasprit Bumrah Set To Unique Record His Name In History Books: వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను 3-2 తేడాతో కోల్పోయిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరంభం అయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. మూడు మ్యాచ్లు జియో సినిమా, స్పోర్ట్స్18 చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్కు చేరింది.
ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 వంటి మెగా టోర్నీల నేపథ్యంలో సీనియర్లు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లతో సహా చాలా మంది రెగ్యులర్ ప్లేయర్లకు బీసీసీఐ ఈ సిరీస్లో విశ్రాంతి ఇచ్చింది. సీనియర్లు గైర్హాజరు కావడంతో బీసీసీఐ సెలక్టర్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించారు. గాయం కారణంగా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్తో మొదటి టీ20 ద్వారానే తన పేరుపై ఓ అరుదైన రికార్డు లిఖించుకోనున్నాడు.
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించిన తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలవనున్నాడు. టీ20లో ఇప్పటివరకు టీమిండియాకు 10 మంది నాయకత్వం వహించినా.. అందరిలో ఎవరూ కూడా స్పెసలిస్ట్ బౌలర్ లేరు. 9 మంది బ్యాట్స్మెన్ కాగా.. ఓ ఆల్రౌండర్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మొదటి కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్. 2007 టీ20 ప్రపంచకప్ నుంచి ఎంఎస్ ధోనీ సారథిగా ఉన్నాడు. మహీ గైర్హాజరీలో సురేశ్ రైనా, అజింక్యా రహానే కొన్ని మ్యాచ్ల్లో జట్టును నడిపించారు.
Also Read: APL 2023: నేటి మ్యాచ్కు శ్రీలీల.. భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ గెలిచే అవకాశం!
2017లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించారు. 2022లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్లకు కూడా జట్టు బాధ్యతలు అందుకున్నారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్గా చేశాడు. ఇందులో హార్దిక్ (ఆల్రౌండర్) మిన్నగా మిగతావారందరూ బ్యాట్స్మెన్లు అన్న విషయం తెలిసిందే. దాంతో జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డును తన పేరుపై లిఖించుకోనున్నాడు.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..