WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు భారత జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాపడుతున్నారు. పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, కీపర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు ఎంపిక చేయకముందే గాయాల కారణంగా దూరం అయ్యారు. అయితే జట్టును ప్రకటించిన తర్వాత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో గాయపడి దూరం కాగా.. అతని స్థానంలో యువ ప్లేయర్ ఇసాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చింది.
Also Read : IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..
Also Read
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
మరో వైపు శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ లు గాయాల నుంచి కోలుకున్నారా.. కోలుకుంటే పిట్ నెస్ సాధించారా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ షాక్ ల నుంచి ఇంకా కోలుకోకముందే టీమ్ ఇండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Supreme Court: పాత విద్యుత్ బిల్లును కొత్త యజమానుల నుంచి వసూలు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఐపీఎల్ లో అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేదు. టాస్ సందర్భంగా రాజస్థాన్ సారథి సంజు శాంసన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకనే చివరి నిమిషంలో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందని శాంసన్ పేర్కొన్నాడు. ఈ విసయం తెలిసిన అశ్విన్ ఫ్యాన్స్ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : AP BJP: ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
ఇక.. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే కనీసం రెండో ప్రయత్నంలో అయినా ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవాలని భావిస్తున్న భారత జట్టుకు ఇది నిజంగానే గట్టి ఎదురుదెబ్బ అనోచ్చు. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి 12 వరకు భారత్-ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
తాజావార్తలు
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?