WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు భారత జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాపడుతున్నారు. పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, కీపర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు ఎంపిక చేయకముందే గాయాల కారణంగా దూరం అయ్యారు. అయితే జట్టును ప్రకటించిన తర్వాత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో గాయపడి దూరం కాగా.. అతని స్థానంలో యువ ప్లేయర్ ఇసాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చింది.
Also Read : IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మరో వైపు శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ లు గాయాల నుంచి కోలుకున్నారా.. కోలుకుంటే పిట్ నెస్ సాధించారా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ షాక్ ల నుంచి ఇంకా కోలుకోకముందే టీమ్ ఇండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Supreme Court: పాత విద్యుత్ బిల్లును కొత్త యజమానుల నుంచి వసూలు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఐపీఎల్ లో అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేదు. టాస్ సందర్భంగా రాజస్థాన్ సారథి సంజు శాంసన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకనే చివరి నిమిషంలో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందని శాంసన్ పేర్కొన్నాడు. ఈ విసయం తెలిసిన అశ్విన్ ఫ్యాన్స్ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : AP BJP: ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
ఇక.. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే కనీసం రెండో ప్రయత్నంలో అయినా ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవాలని భావిస్తున్న భారత జట్టుకు ఇది నిజంగానే గట్టి ఎదురుదెబ్బ అనోచ్చు. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి 12 వరకు భారత్-ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!