ODI World Cup 2023: జస్ప్రీత్ బుమ్రా లేకుంటే.. భారత్కు ప్రపంచకప్ 2023 కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif React on Jasprit Bumrah’s fitness: వెన్నుగాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాదాపుగా ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుమ్రానే కెప్టెన్గా ఎంపిక చేశారు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడని బుమ్రా.. ఎలా రాణిస్తాడనే అంశంపై అందరికి ఆసక్తి పెరిగింది. వన్డే ప్రపంచకప్ 2023 ముందుర అతడు ఫామ్ అందుకోవాలి భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే బుమ్రా పునరాగమనంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పిచ్సైడ్-మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మహమ్మద్ కైఫ్ మీడియాతో మాట్లాడుతూ భారత ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ‘భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో మన అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఓ మార్గం ఉంది. గాయపడి వచ్చిన ఆటగాళ్లంతా ఫామ్ అందుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. ఫిట్నెస్ సాదించేందుకు ఐర్లాండ్ పర్యటన ఉపయోగపడనుంది. ప్రపంచకప్ నాటికి బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే భారత్కు ఎంతో మేలు కలుగుతుంది. బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారతుంది. ఒకవేళ బుమ్రా ఈసారి మెగా టోర్నీలోనూ ఆడకపోతే భారత్కు చాలా నష్టం జరుగుతుంది. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ 2022లో ఏం జరిగిందో తెలుసు’ అని కైఫ్ అన్నాడు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
Also Read: WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియన్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అనసూయ!
‘జస్ప్రీత్ బుమ్రాకు బ్యాకప్ పేస్ బౌలర్ లేడు. ఇప్పుడైతే పేపర్ మీదా భారత్ బలమైన జట్టుగా అనిపించడం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తోంది. విండీస్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ప్రయోగాలు చేసింది. వాటిపై ఎలాంటి కామెంట్ చేయను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని యువకులకు అవకాశం ఇచ్చారు. అయితే ఆసియా కప్ నుంచి భారత్ తీసుకునే నిర్ణయాలపై మాత్రం స్పందిస్తా. ఆ టోర్నీకి 15 మంది ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తారనేది చాలా కీలకం. ఎందుకంటే ఆసియా కప్లో ఆడే జట్టే ప్రపంచ కప్లోనూ ఆడుతుంది’ అని కైఫ్ చెప్పుకొచ్చారు.
2022 సెప్టెంబర్ నుంచి జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆపై బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఫిట్నెస్ సాధించిన అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. బుమ్రా చివరిగా గతేడాది సెప్టెంబర్లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో ఆడాడు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!