Jasprit Bumrah : బుమ్రా గాయంపై వీడని సస్పెన్స్! అసలు విషయం దాస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 6 నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ 2022, టీ20వరల్డ్ కప్ 2022, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలు ఆడని జస్ప్రిత్ బుమ్రా.. ఐపీఎల్ 2023 సీజన్ తో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ పైనల్ కి కూడా దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం గురించి మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బుమ్రా త్వరలోనే కోలుకుని, టీ20 వరల్డ్ కప్ 2000 టోర్నీ ఆడతాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ చేశాడు. అయితే అలా జరగలేదు.. తాను ఫిట్ గా ఉన్నానని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని జస్ప్రిత్ బుమ్రా స్వయంగా ప్రకటించాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ పెద్దలు మాత్రం జస్ప్రిత్ బుమ్రాని ఆడించి రిస్క్ చేయడం ఇష్టం లేక ఆపేస్తున్నారట.
Also Read : GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
దీనికి ప్రధాన కారణం దీపక్ చాహార్.. భారత ఆల్ రౌండర్ దీపక్ చాహార్ కూడా ఇదే విధంగా వెన్ను నొప్పితో బాధపడుతూ టీమ్ కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్ కి ముందు వెన్ను గాయంతో ఆటకు దూరమైన దీపక్ చాహార్, పూర్తిగా కోలుకుని తిరిగి ఆడడానికి ఆరు నెలల దాకా సమయం తీసుకున్నాడు.. బుమ్రా గాయపడడంతో దీపక్ చాహార్ ని ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడించాలని అనుకుంది టీమిండియా. అయితే అది కూడా వర్కవుట్ కాలేదు. బుమ్రా గాయపడిన కొన్ని రోజులకే దీపక్ చాహార్ కూడా గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతను మళ్లీ ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా దీపక్ చాహార్ రీఎంట్రీ ఇస్తున్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం దాదాపు ఒక్కటే రకం. అందుకే చాహార్ కి జరిగినట్టు, జస్ప్రిత్ బుమ్రా విషయంలో జరగకూడదని తెగ జాగ్రత్త పడుతుంది బీసీసీఐ. అందుకే జస్ప్రిత్ బుమ్రా ఫిటినెస్ గురించి ఎవ్వరికీ తెలియకుండా టాప్ సీక్రెట్ మెయింటైన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
Also Read : IPL 2023 : అన్బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్
బీసీసీఐలో ఉన్న చాలామందిక కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎస్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం బుమ్రాని స్పెషల్ గా పర్యవేక్షిస్తున్నాడు. బుమ్రాతో, ఫిజియోలతో మాట్లాడుతూ అతన్ని ట్రైయిన్ చేస్తున్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యులకు కూడా బుమ్రా గాయం గురించి ఎలాంటి వివరాలు తెలీదు. టీమిండియా హెడ్ కోచ్ రాహెల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు కూడా జస్ప్రిత్ బుమ్రా గురించి ఎలాంటి విషయాలు తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు.. అయితే వెంటనే ఆడిస్తే మళ్లీ గాయపడే అవకాశాలు ఉన్నాయని ఉద్దేశంతో అతన్ని దాచి పెట్టి బీసీసీఐ మానిటర్ చేస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గురించి కాకుండా, వచ్చే నాలుగైదు ఏళ్లు బుమ్రా భవిష్యత్ ని దృష్టిని పెట్టుకుని.. ఈ విధంగా చేస్తోందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!