జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం.
బుధవారం నాడు రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటంతో రాక్ఫాల్ల కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
కుటుంబ రాజకీయాలు చేసేవారు.. కేవలం వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే చేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు గుప్పించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది అని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో పాకిస్థానీ క్వాడ్కాప్టర్లను నేలకూల్చేందుకు శుక్రవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద కాపలాగా ఉన్న ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.