Amit Shah On Terrorism: త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు.. ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu & Kashmir: యాసిన్ మాలిక్ ఉగ్రవాద సంస్థ జేకేఎల్ఎఫ్పై విధించిన నిషేధాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యాసిన్ మాలిక్తో పాటు హోం మంత్రిత్వ శాఖ JKPL (ముక్తార్ అహ్మద్ వాజా), JKPL (బషీర్ అహ్మద్ తోట), JKPL (గులాం మహమ్మద్ ఖాన్), JKPL (అజీజ్ షేక్) వర్గాలను కూడా నిషేధించినట్లు కేంద్ర హోంమంత్ర్వశాఖ వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతకు ఎవరైనా సవాలు విసిరితే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా అన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గానూ మోడీ ప్రభుత్వం ‘జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్’ని నిషేధిత గ్రూపుగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇక, భారత ఎన్నికల సంఘం వచ్చే లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న తరుణంలో హోం మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. ఈరోజు కొన్ని రాష్ట్రాల లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. జమ్మూకశ్మీర్లో కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, మార్చి 12 వ తేదీన మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ను చట్టవిరుద్ధమైన గ్రూపుగా పేర్కొంటూ నిషేధించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నాడు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ( X )లో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ ప్రజలు ఉగ్రవాద శక్తులను నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారు అంటూ అమిత్ షా వెల్లడించారు.
Pursuing PM @narendramodi Ji's policy of zero-tolerance towards terrorism, the MHA has declared four factions of the Jammu and Kashmir Peoples League—namely, JKPL (Mukhtar Ahmed Waza), JKPL (Bashir Ahmad Tota), JKPL (Ghulam Mohammad Khan) and JKPL (Aziz Sheikh) led by Yaqoob…
— Amit Shah (@AmitShah) March 16, 2024
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!