Pakistan: సౌదీ యువరాజుతో పాక్ ప్రధాని భేటీ.. కాశ్మీర్పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. సౌదీ అరేబియాలో పర్యటించారు. అక్కడ షెహబాజ్ షరీఫ్.. సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు, చారిత్రక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు వివిధ రంగాలలో మరింత అభివృద్ధికి అవకాశాలను సమీక్షించినట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో అభివృద్ధిపై ఉన్న అవకాశాలను సమీక్షించారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ అంశంపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరుదేశాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. భారత్- పాకిస్థాన్ నడుమ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించినట్లు తెలిపాయి. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ వివాదాన్ని ప్రస్తావనకు వచ్చింది. శాంతి, స్థిరత్వం నెలకొనడానికి రెండు దేశాలు జరపాల్సిన చర్చల అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఉగ్రవాదులను వదలబోమంటూ భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలపై పాకిస్థాన్ స్పందించింది. దానిని ఖండిస్తున్నట్లు పేర్కొన్న పాక్.. భారత్తో ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చలు అవసరమని తెలిపింది. కాగా ఈ సమావేశంలో సౌదీ ప్రధానితో చర్చించిన అంశాలను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య చర్చల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి, ఈ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను నిర్ధారించడానికి షరీఫ్-సల్మాన్ మధ్య జరిగిన సమావేశంపై సంయుక్త ప్రకటన వెలువడింది.
ఇటీవల పాకిస్థాన్లో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్కు చెందిన పార్టీ విజయం సాధించింది. భుట్టో పార్టీతో మద్దతు అధికారం చేపట్టింది. ఇక జర్దారీ పాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
HRH the Crown Prince met with the Prime Minister of Pakistan. They reviewed historical relations, bilateral cooperation, and opportunities for further development across various sectors, in addition to discussing regional and international developments. pic.twitter.com/chNAnXiTqS
— Foreign Ministry 🇸🇦 (@KSAmofaEN) April 7, 2024
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!