జమ్మూకాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డ్ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
జమ్మూ కాశ్మీర్లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్మెంట్ జోన్గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. "బాధల్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్లుగా విభజించాం. అన్ని…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆ రాష్ట్రానికి శుభవార్త అందింది. దీని వల్ల జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజల జీవితాలు మారవచ్చు.
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.