Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
- కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా అభివర్ణించిన రాహుల్ గాంధి
- వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అగ్రనేత
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
READ MORE: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు, “భారతదేశ చరిత్రలో మనం జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరియు కాశ్మీర్ ఆ రాష్ట్ర హోదాను తీసివేసి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే, మేము – ‘భారత్’ కూటమి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాను. దీని కోసం మేము లోక్సభ, రాజ్యసభలలో మా పూర్తి బలాన్ని ఉపయోగిస్తాం. ” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE:Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత కాలం బయటి వ్యక్తులు లాభపడతారని, స్థానిక ప్రజలు విస్మరించబడుతూనే ఉంటారని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాష్ట్ర హోదాను లాక్కోవడానికి ఇదే కారణమని.. వారు జమ్మూ కాశ్మీర్ను పరిపాలించాలని బయటి వ్యక్తులను కోరుకుంటున్నారన్నారు.
PoK Will Be Part Of India – MODI govt
Whereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri pandits
Accidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
తాజావార్తలు
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!