Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
- కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా అభివర్ణించిన రాహుల్ గాంధి
- వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అగ్రనేత
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
READ MORE: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు, “భారతదేశ చరిత్రలో మనం జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరియు కాశ్మీర్ ఆ రాష్ట్ర హోదాను తీసివేసి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే, మేము – ‘భారత్’ కూటమి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాను. దీని కోసం మేము లోక్సభ, రాజ్యసభలలో మా పూర్తి బలాన్ని ఉపయోగిస్తాం. ” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE:Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత కాలం బయటి వ్యక్తులు లాభపడతారని, స్థానిక ప్రజలు విస్మరించబడుతూనే ఉంటారని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాష్ట్ర హోదాను లాక్కోవడానికి ఇదే కారణమని.. వారు జమ్మూ కాశ్మీర్ను పరిపాలించాలని బయటి వ్యక్తులను కోరుకుంటున్నారన్నారు.
PoK Will Be Part Of India – MODI govt
Whereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri pandits
Accidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!