J-K: జమ్మూకశ్మీర్ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం.. దాడికి పెద్ద ఎత్తున ప్లాన్
- జమ్మూకశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు
- రెండు దశల్లో పోలింగ్ పూర్తి
- కొద్ది రోజుల్లో చివరి దశ ఓటింగ్
- ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం
- దాడికి పెద్ద ఎత్తున ప్లాన్
జమ్మూకశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో పోలింగ్ జరగ్గా ఇప్పుడు చివరి దశ ఓటింగ్ పెండింగ్లో ఉంది. మరోవైపు లోయలో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదుల సాయంతో లోయ వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి.. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. లష్కరే తోయిబా, జైష్, హిజ్బుల్ ఉగ్రవాదులు పీఓకేలో మకాం వేశారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు.
READ MORE: Israel-Iran: ఇజ్రాయెల్తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ఓ జాతీయ మీడియాకు ఇంటెలిజెన్స్ అలర్ట్ కాపీ లభించింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల బృందంతో భారత వ్యతిరేక సమావేశాన్ని నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఖుయిరట్టాలో ఐఎస్ఐ ప్రతినిధి ఆగస్టు 29న కొందరు ఉగ్రవాదులతో సమావేశమయ్యారని ఈ హెచ్చరికలో స్పష్టంగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లోకి ఎలా ప్రవేశించాలి. ఎక్కడ విధ్వంసం సృష్టించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో బ్లూప్రింట్ను సిద్ధం చేశారు.
READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..
హెచ్చరిక ప్రకారం.. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 2 నుంచి 3 మంది ఉగ్రవాదుల బృందం పీఓకేలోని దుధినాల్ సెక్టార్ నుంచి కుప్వారా సెక్టార్లోకి ప్రవేశించింది. ఇది మాత్రమే కాదు.. పీఓకేలోని గబ్డోరి గ్రామంలోని లాంచ్ ప్యాడ్ వద్ద జైషే మహ్మద్కు చెందిన 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ఎకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, గ్రెనేడ్లు ఉన్నాయి. వారు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడవచ్చు. ఈ టెర్రరిస్టులంతా లోయలో తీవ్రవాద ఘటనలు చేయాలనుకుంటారు.
READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..
గూఢచార సంస్థల నుంచి వచ్చిన ఈ ముఖ్యమైన ఇన్పుట్ పాకిస్థాన్, ఐఎస్ఐ యొక్క కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. ఇందులో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. వారిని పెంచి పోషిస్తోది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో భారత్పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐఎస్ఐ సిద్ధమవుతోంది. అయితే .. భారత భద్రతా సంస్థలు కూడా ఫుల్ అలర్ట్ మోడ్లో ఉన్నాయి. ప్రతి ఉగ్రవాద కుట్రను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉన్నారు.
- Tags
- ISI
- Jammu
- jammu kashmir
- LOC
- Pakistan
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!