J-K: జమ్మూకశ్మీర్ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం.. దాడికి పెద్ద ఎత్తున ప్లాన్
- జమ్మూకశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు
- రెండు దశల్లో పోలింగ్ పూర్తి
- కొద్ది రోజుల్లో చివరి దశ ఓటింగ్
- ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం
- దాడికి పెద్ద ఎత్తున ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో పోలింగ్ జరగ్గా ఇప్పుడు చివరి దశ ఓటింగ్ పెండింగ్లో ఉంది. మరోవైపు లోయలో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదుల సాయంతో లోయ వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి.. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. లష్కరే తోయిబా, జైష్, హిజ్బుల్ ఉగ్రవాదులు పీఓకేలో మకాం వేశారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు.
READ MORE: Israel-Iran: ఇజ్రాయెల్తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ఓ జాతీయ మీడియాకు ఇంటెలిజెన్స్ అలర్ట్ కాపీ లభించింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల బృందంతో భారత వ్యతిరేక సమావేశాన్ని నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఖుయిరట్టాలో ఐఎస్ఐ ప్రతినిధి ఆగస్టు 29న కొందరు ఉగ్రవాదులతో సమావేశమయ్యారని ఈ హెచ్చరికలో స్పష్టంగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లోకి ఎలా ప్రవేశించాలి. ఎక్కడ విధ్వంసం సృష్టించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో బ్లూప్రింట్ను సిద్ధం చేశారు.
READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..
హెచ్చరిక ప్రకారం.. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 2 నుంచి 3 మంది ఉగ్రవాదుల బృందం పీఓకేలోని దుధినాల్ సెక్టార్ నుంచి కుప్వారా సెక్టార్లోకి ప్రవేశించింది. ఇది మాత్రమే కాదు.. పీఓకేలోని గబ్డోరి గ్రామంలోని లాంచ్ ప్యాడ్ వద్ద జైషే మహ్మద్కు చెందిన 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ఎకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, గ్రెనేడ్లు ఉన్నాయి. వారు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడవచ్చు. ఈ టెర్రరిస్టులంతా లోయలో తీవ్రవాద ఘటనలు చేయాలనుకుంటారు.
READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..
గూఢచార సంస్థల నుంచి వచ్చిన ఈ ముఖ్యమైన ఇన్పుట్ పాకిస్థాన్, ఐఎస్ఐ యొక్క కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. ఇందులో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. వారిని పెంచి పోషిస్తోది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో భారత్పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐఎస్ఐ సిద్ధమవుతోంది. అయితే .. భారత భద్రతా సంస్థలు కూడా ఫుల్ అలర్ట్ మోడ్లో ఉన్నాయి. ప్రతి ఉగ్రవాద కుట్రను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉన్నారు.
- Tags
- ISI
- Jammu
- jammu kashmir
- LOC
- Pakistan
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!