ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠా నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై దాడులకు తెగబడ్డారు. దీంతో.. దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. మంగళవారం అర్థరాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. అక్కడ వున్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు, వారితో పాటు తీసుకు వచ్చిన పేలుడు…
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో…
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు జయలలిత తర్వాత చక్రం తిప్పిన నేత శశికళ. ఇప్పుడామె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో దూసుకుపోవాలని భావించిన ఆమె ఆశలు తీరలేదు. పైగా కేసులతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన శశికళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం పడకపోవడంతో ఆమె కీలక నిర్ణయం…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ఆ కేసులో దోషిగా ఉన్న పేరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 31 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు ఈ…
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. Read Also: గాంధీ ఆస్పత్రికి…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
కరీంనగర్లో అరెస్టై జైలులో వున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ తో పాటు ముగ్గురు కార్పొరేటర్లను జైల్లో పరామర్శించానన్నారు ఈటల. మొన్న జరిగింది అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య విలువలకు పాతర పెట్టారు. ఉద్యోగులను ఎవరూ ఆదుకోవడం లేదని మధన పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు బండి సంజయ్ జాగరణకు పిలుపునిచ్చారు. సీపీ వాటర్ క్యానన్లతో శత్రువుల మీద దాడి చేయడం…
సీఎం కేసీఆర్ ఇక జైలుకు పోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై ధ్వజమెత్తారు. కేసీఆర్పై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే సీబీఐ, ఈడీ విచారణ చేస్తుందని వంద శాతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్పై పన్ను తగ్గిస్తే రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెట్రో, డీజీల్పై పన్నును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. డిజీల్ ధరలు…
కరోనా సమయంలో ప్రపంచంలో సింహభాగం ప్రజలు ఇంటివద్ధనే ఉండిపోయారు. కరోనా నుంచి కోలుకున్నాక ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు పెరిగిపోయాయి. విడిపోయే జంటలు పెరిగాయి. కరోనా మహమ్మారి ఇటలీని ఎంతగా కుదిపేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చైనా తరువాత కేసులు నమోదైంది ఇటలీలోనే. ఇటలీలో పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్న సమయంలో జైల్లో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని ఇంటికి పంపేశారు. ఇళ్లలోనే జైలు జీవితం గడిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే, గైడోనియా మౌంటేసిలియోలోకి చెందిన వ్యక్తి…
ఏ పని పూర్తి చేయడానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి. దానికి తగిన పట్టుదల, ఓర్పు, సహనం ఉండాలి. అంతకు మించి వారితో కలిసి పనిచేసే వ్యక్తులు ఉండాలి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఎలాంటి కష్టమైన పనినైనా పూర్తిచేయవచ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్కు చెందిన ఖైదీలు. ఇజ్రాయిల్లోని గిల్బోవా అనే జైలు ఉన్నది. అందులో కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఆరుగురు ఖైదీలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. వారు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం…