Podu Lands Row: ఎటూ తెగని పోడు భూముల లొల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో పోడు పోరు హాట్ టాపిక్ అవుతోంది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ల రేంజ్ పరిధిలోని కోయపోష గూడెంలో అడవిని నరికేస్తున్నారని అటవీశాఖ అధికారులు 12 మంది మహిళలను అరెస్ట్ చేసారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టగా వారిని జైల్ కు సైతం పంపారు. జైల్ కు వెళ్ళిన ఆదివాసీ మహిళలు రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలై గ్రామానికి చేరుకున్నారు. అయితే తమకు భూమే ఆధారం ..ఎట్టి పరిస్థితుల్లో తాము పోడు చేసుకుంటున్న భూమిని వదిలిపెట్టబోమంటున్నారు.
Also Read
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
అయితే గ్రామానికి వెళ్ళిన అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కాని ససేమిరా అన్నారు. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. భూమి తమకే కావాలంటుండగా అధికారులు మాత్రం అక్రమంగా అడవిలోకి చొరబడి 8హెక్టార్ల లో అడవిని ఈమధ్యనే నరికారని మంచిర్యాల డీఎఫ్ ఓ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఇన్నాళ్ల పాటు ఎవ్వరు పోడు చేయలేదని ఏడాది క్రితం నుంచే ఆదివాసీలు కోయపోషగూడెం శివారులో అడవిని నరికారని తామెవ్వరికీ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని చేసినా ఆదివాసీలకు ఆభూమి రాదని తేల్చారు.
భూమి దక్కదు, ఇవ్వమని అధికారులు అంటుంటే ఆదివాసీలు మాత్రం తమకు తిండి సైతం లేదని ఆధారమైన భూమికోసం మరోసారి జైల్ కు సైతం వెళ్తామని చెప్పేస్తున్నారు ఆదివాసీలు. ఎన్నికేసులు పెట్టినా తాము భూమి వదిలి వెళ్ళబోమంటున్నారు. భూమి తమకు వచ్చే వరకు పోరాటం ఆపబోమని అప్పటివరకు ఇక్కడే ఉంటామంటున్నారు ఆదివాసీ మహిళలు. వీటన్నింటిపై జిల్లా అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐటీడీఏ పీఓ సైతం ఆదివాసీలతో మాట్లాడారు..భూమి హక్కు పత్రాలకోసం ఆదివాసీలు పట్టుబడుతుంటే అధికారులు మాత్రం అసలు పోడే లేదంటున్నారు. గతంలో తమకే భూమి చెందుతుందన్న అధికారులు..ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ సంఘాల నాయకులు.
తాజావార్తలు
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!