దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. టూ వీలర్స్తో పాటు కార్లను కూడా ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే టాటా మొదలు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో కీలకమైనది బ్యాటరీ ఛార్జింగ్. ఛార్జింగ్కు ఎక్కువసమయం తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల మాదిరిగానే దేశంలో ఎలక్ట్రిక్ రీఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మీడియం ఛార్జింగ్ నుంచి హైస్పీడ్ ఛార్జింగ్ ల వరకు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్ వద్ద నేషనల్ హైవే ఫర్…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు…
క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాయి.. ఇదే సమయంలో.. కెనడా కూడా ఆంక్షలు విధించి.. ఆ…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. రోజుకవారీ కరోనా పాజిటివిటీ రేటు…
దేశంలో కరోనా మహమ్మారి తరువాత సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సెకండ్ హ్యాండ్ కార్లకు ఏ విధంగా డిమాండ్ ఏర్పడిందో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నది. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 2021లో 2.50 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైళ్లు ఇండియా మార్కెట్లో అమ్ముడయ్యాయి. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2019 నుంచి 21 వరకు సెకండ్ హ్యాండ్ మొబైళ్ల వ్యాపారంలో…
ఇప్పటి వరకు ఇండియా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో దిగుమతుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నది. అయితే, ఆత్మనిర్భర్లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పిన్స్కు ఎగుమతి చేసేందుకు ఒప్పదం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు. ఫిలిప్పిన్స్ రక్షణశాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆదేశ రక్షణశాఖ వెబ్సైట్లో పేర్కొన్నది. త్వరలోనే ఇండియా బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పిన్స్కు ఎగుమతికానున్నాయి. క్షిపణులతో…