ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం.…
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కావడంతో ఎన్నికలు వాయిదా పడతాయని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం చర్చించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ…
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. రెండో రోజు ఆటను పూర్తిగా అడ్డుకున్నాడు. దీంతో రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు కాగా తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికాపై…
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్పీసీ 144 సెక్షన్లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు విద్యార్ధులు. లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వంటి మహమ్మారులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కేసులు తగ్గడం ప్రారంభించడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచదేశాలు నడుంబిగించాయి. వచ్చే ఏడాది వరకు ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రిటీష్ కన్సల్టెన్సీ సంస్థ సెబ్ఆర్ వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా 2028 లో దాటిపోతుందని అనుకున్నా, 2030 వరకు దానికోసం…
సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్ ఆద్మీ…
దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. Read Also: టిక్కెట్…