Home
India
India News
-
Russia Ukraine War: భారత్పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త… -
Corona Updates: దేశంలో కరోనా ఢమాల్.. కొత్త కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 226గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు.… -
Ukraine Russia Tensions: ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక… -
Ukraine Crisis: ఉక్రెయిన్లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల… -
Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఊపిరి పీల్చుకుంటున్న భారత్
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది. కరోనా కేసులు తగ్గుముఖం… -
IND Vs SL: నేడే తొలి టీ20.. టీమిండియాకు కీలక ఆటగాళ్లు దూరం
శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని… -
Stock Market: స్టాక్ మార్కెట్కు యుద్ధ భయం… ఐదోరోజు కూడా…
స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయం పట్టుకున్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్ని సందిగ్ద పరిస్థితులు మార్కెట్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు కుప్పకూలడంతో ఆందోళన మదుపురుల్లో ఆందోళన మొదలైంది సెన్సెక్స్ 382.91 పాయింట్ల నష్టపోయి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు కోల్పోయి 17,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. Read: Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో… -
Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో డిబేట్కు రెడీ…
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు… -
Twins Day Festival: అదరహో అనిపించిన కవలలు
ఇవాళ ట్విన్స్ డే. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వారంతా కలిసి చేసుకునే అద్భుతమయిన వేడుక అది. సాగరతీరం విశాఖలో కవలలు సందడి చేశారు. విశాఖలో 30కి పైగా కవల జంటలు ఆడి పాడారు. అందరితో సంతోషంగా గడిపారు. ఒకేరూపం మనుషులు మాత్రం ఇద్దరు. అదేదో సినిమాలో చూసినట్టుగా వీరంతా ఒకేచోట కలిసి చేసిన సందడి అదరహో అనిపించింది. విశాఖ నగరంలోని ఓ హోటల్ లో ట్విన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ-తెలంగాణ కు చెందిన… -
KIA Cars: అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లు…
ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు…
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!