పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్ లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు.
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎక్స్ఎల్6 ఎక్స్-షోరూమ్ ధరలను గణనీయంగా పెంచింది. XL6 కారు ధరను కంపెనీ భారీగా పెంచింది. మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో XL6 ఒకటి.
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.వేసవి తాపానికి తాళలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rise In Temperature: ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.